‘ది ఫినిషర్’ ..మళ్లీ కనిపిస్తాడా?
ఆఖరి ఓవర్లో విజయానికి 15 పరుగులు చేయాల్సి ఉంటే.. ఒత్తిడుండేది ధోనీ మీద కాదు, బౌలర్ మీద’.. ఇదీ ఒకప్పుడు మహేంద్రసింగ్ ధోనీ గురించి క్రికెట్ విశ్లేషకులు గర్వంగా చెప్పిన మాటలు. అతడు క్రీజులో ఉంటే బంతి వేయకముందే సగం ఓటమి పాలైనట్టు భావించేవారు ప్రత్యర్థి బౌలర్లు....
సీన్-2లో ధోనీపైనే ఒత్తిడి..
సీన్ 1: ‘ఆఖరి ఓవర్లో విజయానికి 15 పరుగులు చేయాల్సి ఉంటే.. ఒత్తిడుండేది ధోనీ మీద కాదు, బౌలర్ మీద’.. ఇదీ ఒకప్పుడు మహేంద్రసింగ్ ధోనీ గురించి క్రికెట్ విశ్లేషకులు గర్వంగా చెప్పిన మాటలు. అతడు క్రీజులో ఉంటే బంతి వేయకముందే సగం ఓటమి పాలైనట్టు భావించేవారు ప్రత్యర్థి బౌలర్లు.
సీన్ 2: ఆఖరి ఓవర్. పైగా అసలు అనుభవమే లేని స్పిన్నర్. వైడ్తో ఆరంభించాడు. 23 పరుగులు చేస్తే విజయం. క్రీజులో ఎంఎస్ ధోనీ. తొలి రెండు బంతుల్లో 2, 4. ఇక 4 బంతుల్లో 17 పరుగులే అవసరం. ప్రస్తుతం టీ20ల్లో ఈ సమీకరణం కష్టమేమీ కాదు. కానీ మూడో బంతికి మహీ సింగిల్ తీశాడు. ఐదో బంతికీ ఒక పరుగుకే పరిమితం అయ్యాడు. ఇంకేముంది ప్రత్యర్థి ఖాతాలో 7 పరుగుల తేడాతో విజయం.
నిజం.. కఠినమే
ఈ రెండు సన్నివేశాలను కలిపి చూస్తే తెలిసేది ఒక్కటే. ఇప్పుడు మహీ ఆఖరి ఓవర్లో క్రీజులో ఉన్నా ప్రత్యర్థికి గెలుపుపై భరోసా ఉంటోంది. అతడు షాట్లు ఆడకుండా కట్టడి చేయొచ్చన్న ఆత్మవిశ్వాసం పెరిగింది. తెలివిగా బంతులేసి సింగిల్స్కే పరిమితం చేయొచ్చని అర్థమవుతోంది. చురుకైన ఫీల్డర్లను పెడితే రనౌట్ సైతం చేయొచ్చని తెలిసిపోయింది. ఎందుకంటే.. ‘ధోనీ.. ది ఫినిషర్’ ఇప్పుడు అంతగా కనిపించడం లేదు! ఓడిపోయే మ్యాచుల్లో అజేయంగా నిలుస్తున్నాడు. అభిమానులు ఔనన్నా.. కాదన్నా.. గత మూడేళ్ల ప్రదర్శన ఆధారంగా విశ్లేషకులు చెబుతున్న కఠినమైన మాటలివి.
2014 తర్వాత 3 ఓటములు
బీసీసీఐ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే టీ20 క్రికెట్ లీగులో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై. ఇప్పటి వరకు 169 మ్యాచుల్లో 101 విజయాలు అందుకుంది. గెలుపు శాతం 60. రెండోస్థానంలోని ముంబయి కన్నా 2% ఎక్కువే. ఇక ట్రోఫీల విషయానికి వస్తే 3 సార్లు విజేతగా అవతరించింది. ఎక్కువ ప్లేఆఫ్లు, ఎక్కువ ఫైనళ్లు ఆడిన ఏకైక జట్టు. అసలు భీకరంగా ఆడే ధోనీసేన వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయిన సందర్భాలే అత్యంత అరుదు. అలాంటిది 2014 తర్వాత ఈ సీజన్లో వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి అభిమానులను నిరాశపరిచింది. మరీ ముఖ్యంగా మహీ ఆటతీరు, సారథ్యం ఉసూరుమనిపిస్తోంది. అన్నీ చూసుకొనే రైనా లేడు. సీనియర్ల ఫిట్నెస్పై సందేహాలు నెలకొన్నాయి. ఫీల్డింగ్ దారుణంగా ఉంటోంది. బౌలింగ్లో పస కనిపించడం లేదు. ఆటగాళ్లు గాయాలపాలవుతున్నారు. అంతకుమించి ధోనీయే ఆత్మవిశ్వాసంతో లేకపోవడం కలవరపెడుతోంది.
మరొకరిపై ఆధారం!
హైదరాబాద్తో మ్యాచ్ను గమనిస్తే ఐసీసీ వన్డే ప్రపంచకప్ సెమీస్ గుర్తుకొచ్చింది. అప్పుడు న్యూజిలాండ్పై ఛేదనలోనూ ఇదే సీన్. టాప్ ఆర్డర్ విఫలమైంది. దాంతో భారం రవీంద్ర జడేజా, ధోనీపై పడింది. దూకుడుగా ఆడే బాధ్యతను జడ్డూకు అప్పగించిన మహీ ఆఖరి ఓవర్ వరకు షాట్లే ఆడలేదు. కీలకమైన 49వ ఓవర్లోనూ దంచకపోవడంతో ఆఖరి ఓవర్లో రన్రేట్ పెరిగి ఒత్తిడి ఎక్కువైంది. అనూహ్యంగా రనౌటై నిరాశగా వెనుదిరిగాడు. వార్నర్ సేన నిర్దేశించిన 165 పరుగుల లక్ష్య ఛేదనలోనూ అదే పరిస్థితి. జడ్డూ (50; 35 బంతుల్లో 5×4, 2×6) దూకుడుగా ఆడితే ధోనీ (47*; 36 బంతుల్లో 4×4, 1×6) అజేయంగా నిలిచాడు. కానీ గెలుపునకు అవసరమైన పరుగులు చేయలేదు. ఆరో ఓవర్లో క్రీజులోకి వచ్చిన అతడు 16వ ఓవర్లో కానీ వరుస బౌండరీలు బాదడం మొదలుపెట్టలేదు. ఆఖరి 4 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు సింగిల్ తీసి భారం సామ్ కరన్పై వేయడం పూర్తిగా నిరాశపరిచింది. మరొకరిపై ధోనీ ఆధారపడటాన్ని అభిమానులు చూడలేకపోతున్నారు!
మళ్లీ.. చూపిస్తాడా?
లీగు తొలి మ్యాచులో గాల్లోకి డైవ్చేసిన ధోనీ ‘సింగం’లా కనిపించాడని ఆకాశానికెత్తేశారు. అతడు అత్యంత చురుకుగా, దృఢంగా ఉన్నాడని భావించారు. ఛేదనలో కేదార్ జాదవ్, జడేజా, కరణ్ను తనకన్నా ముందు పంపిస్తే అద్భుత వ్యూహం అమలు చేశాడని ప్రశంసించారు. ఆ తర్వాత మ్యాచుల్లోనూ వారినే ముందు పంపించడం.. జట్టు ఓటమి పాలైతే గానీ మహీకి మ్యాచ్ సన్నద్ధత లేదని తెలియలేదు. ఏడాది కాలంగా క్రికెట్ ఆడకపోవడం, క్వారంటైన్ వల్ల సాధనకు సమయం దొరక్కపోవడంతో లయ అందుకోలేదని అతడే స్వయంగా చెప్పాడు.
హైదరాబాద్తో మ్యాచ్కు ముందు వారం రోజులు విరామం దొరకడంతో సాధన చేసి ధోనీ ఆత్మవిశ్వాసం పెంచుకుంటాడని అంతా భావించారు. కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సైతం అదే అన్నాడు. గత మూడు మ్యాచుల్లోనూ ఏ మాత్రం ఆడని, పరుగులే చేయని జాదవ్నే మళ్లీ ముందు పంపించడంతో అతడు లయ దొరకబుచ్చుకోలేదని అర్థమైంది. ఆఖరి ఓవర్లో సింగిల్స్ తీయడంతో మ్యాచ్పై ఆశలూ పోయాయి. ఇలా అజేయంగా నిలుస్తూ మ్యాచులను గెలిపించకపోతే ఆ పరుగులకు విలువేముందన్న గంభీర్ మాటలే చివరికి నిజమవుతాయా అనిపిస్తోంది. ఓటమి ఎలాగూ ఓటమే. పరుగుల అంతరం తగ్గిస్తే వచ్చే లాభమేముంది? ముందుగా వచ్చి ధాటిగా ఆడుతూ ఔటైనా ఫర్వాలేదనే వ్యాఖ్యల నేపథ్యంలో తనలోని ‘ది ఫినిషర్’ను మహీ ఇక ముందైనా చూపిస్తాడా లేదా చూడాలి!
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి