ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
బోర్డర్-గావస్కర్ ట్రోఫీని భారత్ 2-1 తేడాతో సాధించింది. గబ్బా టెస్టులో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను మట్టికరిపించి చారిత్రక విజయం అందుకుంది. అయితే తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా.. ..
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీని భారత్ 2-1 తేడాతో సాధించింది. గబ్బా టెస్టులో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను మట్టికరిపించి చారిత్రక విజయం అందుకుంది. అయితే తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే కుప్పకూలి జీర్ణించుకోలేని రికార్డును నమోదు చేసింది. దానికి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ పితృత్వ సెలవులపై స్వదేశానికి వెళ్లాడు. దీంతో ఆసీస్ మాజీ క్రికెటర్లు సిరీస్లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూస్తుందని మొదటి టెస్టు అనంతరం జోస్యం చెప్పారు.
‘విరాట్ కోహ్లీ లేకపోతే భారత్కు కష్టమే. 4-0తో ఆస్ట్రేలియాదే సిరీస్’ అని రికీ పాంటింగ్, మార్క్ వా, బ్రాడ్ హాడిన్ పేర్కొన్నారు. మైకేల్ క్లార్క్ ఇంకాస్త తొందరపడి.. ‘కోహ్లీ లేకుండా టీమిండియా కంగారూల గడ్డపై గెలిస్తే ఏడాది పాటు సంబరాలు చేసుకోవచ్చు’ అని మితిమీరిన వ్యాఖ్యలు చేశాడు. వాళ్లకు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ కూడా వంతపాడాడు. కానీ అడిలైడ్ టెస్టు తర్వాత భారత్ దెబ్బతిన్న సింహంలా గర్జించింది. మెల్బోర్న్లో గెలిచించి.. అద్భుత పోరాటంతో సిడ్నీ టెస్టును డ్రాగా ముగించింది. ఇక నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో పూర్తి ఆధిపత్యం చెలాయించి సిరీస్ కైవసం చేసుకుంది.
అయితే భారత్ను తక్కువగా అంచనా వేసిన ఆసీస్ మాజీలపై ప్రస్తుతం నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్లపై మీమ్స్ పోటెత్తున్నాయి. వాళ్లు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేయడంతో పాటు చురకలంటించేలా చేసిన పోస్ట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆసీస్ మాజీలకు టీమిండియా తగిన గుణపాఠం చెప్పిందని పలువురు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, సీనియర్ స్పిన్నర్ అశ్విన్ కూడా ఆసీస్ను ట్రోల్ చేస్తూ పోస్ట్లు పెట్టారు. మాజీ క్రికెటర్లు చేసిన కామెంట్లు ఇప్పుడు చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉందని శశిథరూర్ అన్నారు. క్లార్క్ చెప్పిన్నట్లు ఈ విజయాన్ని ఏడాది పాటు సంబరాలు చేసుకోవాలని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి
ఆసీస్ పొగరుకు, గర్వానికి ఓటమిది
ధోనీని అధిగమించి పంత్ కొత్త రికార్డు..
భారత్ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు