SKY: కెరీర్లో ఇలాంటివి సహజం.. వాటిని అధిగమించడమే సవాల్: ధావన్, యువీ
ఆసీస్తో (IND vs AUS) మూడు వన్డేల్లోనూ సూర్యకుమార్ డకౌట్గా పెవిలియన్కు చేరాడు. తొలి బంతికే ఔట్ కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో అభిమానుల నుంచి విమర్శలు వచ్చినా.. మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు మాత్రం బాసటగా నిలిచారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 క్రికెట్లో అదరగొట్టిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav).. టెస్టులు, వన్డేల్లో మాత్రం తేలిపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది. వరుసగా వన్డేల్లో వచ్చిన అవకాశలను సద్వినియోగం చేసుకోవడంలో సూర్య విఫమలయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో సున్నాకే పెవిలియన్కు చేరిన విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్లోనూ తొలి బంతికే వెనుదిరిగడంపై మాజీలు ఆందోళన వ్యక్తం చేశారు. వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో మరొకరికి అవకాశం ఇచ్చి.. సూర్యకుమార్ను కేవలం పొట్టి ఫార్మాట్కే పరిమితం చేయాలనే సూచనలూ వచ్చాయి. కానీ, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం సూర్యకుమార్కు అండగా నిలిచారు. తాజాగా టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్, మాజీ ఆల్రౌండర్ యువ్రాజ్ సింగ్ సూర్యకు బాసటగా మాట్లాడారు.
‘‘ గత రెండేళ్లుగా సూర్యకుమార్ అద్భుతంగా ఆడుతున్నాడు. నిలకడగా ఆడుతూ వచ్చాడు. అయితే, ఇటీవల సిరీసుల్లో మాత్రం సరిగా రాణించలేదు. క్రికెట్ కెరీర్లో ఫామ్ కోల్పోవడం సహజం. టెస్టు ఫార్మాట్ గురించి చెప్పాలంటే.. పిచ్ చాలా విభిన్నంగా ఉంటుంది. భారత్లో ఆడేటప్పుడు టర్నింగ్ ట్రాక్లను సిద్ధం చేసుకుంటాం. టీమ్ఇండియా గెలవాలంటే ఇలా చేయక తప్పదు. ఇలాంటి పిచ్ మీద రాణించడం బ్యాటర్లకు సవాల్. ఎంత టాప్ బ్యాటర్ అయినప్పటికీ ఆడటం కష్టమవుతుంది. అప్పుడు అనుభవం ఉపయోగపడుతుంది. నేర్చుకునే క్రమంలో యువకులు తప్పులు చేస్తుంటారు’’ అని ధావన్ తెలిపాడు.
సూర్యకుమార్ త్వరలోనే ఆత్మవిశ్వాసం అందిపుచ్చుకుంటాడని మాజీ ఆటగాడు యువ్రాజ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. వచ్చే వన్డే ప్రపంచకప్లో అతడు కీలక పాత్ర పోషిస్తాడని పేర్కొన్నాడు. ‘‘ప్రతి క్రికెటర్ కెరీర్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటాడు. సూర్యకుమార్ తప్పకుండా పుంజుకుంటాడు. అవకాశాలు ఇస్తూ ఉంటే వన్డే ప్రపంచకప్లో భారత్ తరఫున సూర్య కీలక పాత్ర పోషిస్తాడు. మన ఆటగాళ్లు అదరగొడతారు. సూర్యకుమార్ ఆత్మవిశ్వాసం తిరిగి సాధిస్తాడు’’ అని యువీ ట్వీట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్