Shikhar Dhawan: కివీస్పై హాఫ్ సెంచరీ.. దిగ్గజాల సరసన శిఖర్ ధావన్
టీమ్ఇండియా వన్డే జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తోన్న శిఖర్ ధావన్ కివీస్పై హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రికార్డులపరంగా భారత దిగ్గజాల సరసన చేరాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్తో సిరీస్కు కెప్టెన్గా వ్యవహరిస్తోన్న శిఖర్ ధావన్ (72) తొలి మ్యాచ్లో అర్ధశతకం సాధించాడు. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (50)తో కలిసి తొలి వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నిర్మించాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ మరో మైలురాయిని అందుకొన్నాడు. ధావన్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లిస్ట్ - A క్రికెట్లో 12వేల పరుగుల మార్క్ను తాకిన ఏడో భారత బ్యాటర్గా అవతరించాడు. ధావన్ 297 మ్యాచుల్లో 12,025 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇందులో 167 అంతర్జాతీయ వన్డేలు ఉన్నాయి. 17 శతకాలు, 39 అర్ధశతకాలతో 6,744 పరుగులు చేశాడు.
శిఖర్ ధావన్ కంటే ముందు ఆరుగురు బ్యాటర్లు ఈ రికార్డును సాధించారు. సచిన్ తెందూల్కర్ అందరి కంటే ముందున్నాడు. కెరీర్లో 551 మ్యాచుల్లో 21,999 పరుగులు సాధించాడు. ఆ తర్వాత సౌరభ్ గంగూలీ (437 మ్యాచుల్లో 15,622), రాహుల్ ద్రవిడ్ (449 మ్యాచుల్లో 15,271), విరాట్ కోహ్లీ (296 మ్యాచుల్లో 13,786), మహేంద్ర సింగ్ ధోనీ (423 మ్యాచుల్లో 13,353), యువరాజ్ సింగ్ ( 423 మ్యాచుల్లో 12,633) ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..