అక్షయ్‌ కుమార్‌తో వావ్‌ అనిపించే గబ్బర్‌ సెల్ఫీ

టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ను కలిశాడు. ఎప్పుడు ఎక్కడ కలిశాడనే సమాచారం లేకపోయినా సోమవారం ఆ హీరోతో కలిసి దిగిన సెల్ఫీని...

Published : 02 Feb 2021 09:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ను కలిశాడు. ఎప్పుడు ఎక్కడ కలిశాడనే సమాచారం లేకపోయినా సోమవారం ఆ హీరోతో కలిసి దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. మీతో ఉన్నంతసేపూ సరదాగా ఉంటుందని దానికి వ్యాఖ్యానం జతచేశాడు. ఓ చెరువుగట్టు పక్కన ఇద్దరూ సంతోషంగా నవ్వుతున్న ఫొటోను ధావన్‌ అభిమానులతో పంచుకున్నాడు. 

అంతకుముందు టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ దంపతులు ధావన్‌ను కలిశారు. ఆ ఫొటోను ఈ స్పిన్‌ మాంత్రికుడు తన ఇన్‌స్టాలో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ధావన్‌ మంచి ఆతిథ్యం ఇచ్చాడని పేర్కొన్నాడు. కాగా.. ధావన్‌, చాహల్‌ చివరిసారి ఆస్ట్రేలియాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడారు. ఆపై వారు తిరిగి భారత్‌కు చేరుకున్నారు. ఇక ఆసీస్‌ పర్యటనకు ముందు యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ధావన్‌ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో అతడు 17 మ్యాచ్‌ల్లో 618 పరుగులు చేశాడు. అందులో రెండు వరుస శతకాలు బాది ఐపీఎల్‌లో కొత్త రికార్డు నెలకొల్పాడు. మరోవైపు చాహల్‌ 15 మ్యాచ్‌ల్లో 21 వికెట్లతో ఆకట్టుకున్నాడు. 

ఇవీ చదవండి..
వామిక వచ్చేసింది
నువ్వానేనా!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని