IND vs WI: మా ప్లేయర్స్‌ చాలా పరిణతితో ఆడారు: ధావన్‌

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలోనూ టీమ్‌ఇండియా విజయం సాధించడంపై కెప్టెన్ శిఖర్‌ ధావన్‌ హర్షం వ్యక్తం చేశాడు. తమ ఆటగాళ్లు యువకుల్లా అనిపించినా...

Updated : 28 Jul 2022 15:20 IST

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలోనూ టీమ్‌ఇండియా విజయం సాధించడంపై కెప్టెన్ శిఖర్‌ ధావన్‌ హర్షం వ్యక్తం చేశాడు. తమ ఆటగాళ్లు యువకుల్లా అనిపించినా.. చాలా పరిణతితో ఆడారని మెచ్చుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన ధావన్‌.. టీమ్‌ఇండియా ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ఈ జట్టును చూస్తే తనకు గర్వంగా ఉందన్నాడు. అలాగే తాను తిరిగి ఫామ్‌లోకి రావడం కూడా సంతోషంగా ఉందని చెప్పాడు.

‘నేను చాలా కాలంగా ఈ (వన్డే) ఫార్మాట్‌లో ఆడుతున్నా. అయితే, ఈ సిరీస్‌లో తొలి, మూడో మ్యాచ్‌లో ఆడిన తీరు చాలా సంతోషాన్నిచ్చింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్‌గిల్‌ (98) పరుగులు చేయడం చూస్తే చాలా ఆనందం అనిపించింది. ప్రతి ఒక్కరూ మంచి ప్రదర్శన చేశారు. ఈ విజయం చాలా అద్భుతంగా ఉంది. అలాగే మాకు అండగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా బౌలింగ్‌ యూనిట్‌ను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. వారి ప్రదర్శన పట్ల నేను గర్వంగా ఉన్నా. వాళ్లు జట్టుకు వందశాతం తిరిగిచ్చారు. సిరాజ్‌ తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసి శుభారంభం చేశాడు. తర్వాత చాహల్‌, శార్దూల్‌ సైతం అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఈ విజయం చిరస్మరణీయం’ అని ధావన్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని