Shikhar Dhawan: ఒక్క ఇన్నింగ్స్.. ధావన్ నాలుగు రికార్డులు
పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ టీ20 లీగ్లో 6 వేల పరుగుల మైలురాయి చేరుకున్న రెండో ఆటగాడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. గతరాత్రి చెన్నైతో ఆడిన తన 200వ మ్యాచ్లో 88 పరుగులు సాధించి...
ముంబయి: పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ టీ20 లీగ్లో 6 వేల పరుగుల మైలురాయి చేరుకున్న రెండో ఆటగాడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. గతరాత్రి చెన్నైతో ఆడిన తన 200వ మ్యాచ్లో 88 పరుగులు సాధించి ఈ టోర్నీలో మొత్తం 6,086 పరుగులు చేశాడు. దీంతో బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (6,402) తర్వాత ఈ మైలురాయి చేరిన రెండో ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు ధావన్కు ఇది 200వ మ్యాచ్ కావడంతో ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాట్స్మన్గానూ రికార్డు పుటల్లోకెక్కాడు.
ఇదే మ్యాచ్లో ధావన్ మరో రికార్డులో కోహ్లీని అధిగమించడం విశేషం. 9 పరుగుల వద్ద చెన్నై జట్టుపై అత్యధిక పరుగులు (1,022) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇది వరకు విరాట్ 28 ఇన్నింగ్స్ల్లో చెన్నైపై 949 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పుడు ధావన్ అతడిని వెనక్కినెట్టాడు. వీటితో పాటు ధావన్ మొత్తం టీ20 క్రికెట్లో 9వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. విరాట్ ఈ ఫార్మాట్లో ఇప్పటి వరకు 10,392 పరుగులు చేయగా, రోహిత్ 10,048 పరుగులతో కొనసాగుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.