IND vs PAK: 2011 సెమీస్లో పాక్ ఓడటం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా: అక్తర్
2011 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమ్ఇండియా చేతిలో పాకిస్థాన్ ఓటమిపాలవ్వడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు....
అప్పుడు నేనుంటే సచిన్, సెహ్వాగ్ను ఔట్ చేసేవాడిని
ఇంటర్నెట్డెస్క్: 2011 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో టీమ్ఇండియా చేతిలో పాకిస్థాన్ ఓటమిపాలవ్వడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. మొహాలి వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో అక్తర్ ఆడలేకపోయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 260 పరుగులు సాధించగా.. లక్ష్య ఛేదనలో పాక్ 231 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో శ్రీలంకపై గెలిచింది.
తాజాగా నాటి మ్యాచ్ను గుర్తు చేసుకున్న అక్తర్.. ఆ రోజు తాను ఆడి ఉంటే సచిన్, సెహ్వాగ్ వికెట్లను ముందే పడగొట్టేవాడినని చెప్పాడు. ‘2011లో మొహాలి వేదికగా జరిగిన సెమీఫైనల్స్లో పాక్ ఓటమి నన్నింకా వేధిస్తోంది. ఆ రోజు మా జట్టు యాజమాన్యం నన్ను ఆడించాల్సింది. అది సరైన నిర్ణయం కాదు. అప్పటికి నాకు చివరి రెండు మ్యాచ్లే మిగిలి ఉన్నాయని అనుకున్నా. వాంఖడేలో ప్రపంచకప్ గెలిచి పాకిస్థాన్ జెండాను రెపరెపలాడించాలని గట్టిగా కోరుకున్నా. ఆ సమయంలో మాకన్నా భారత జట్టుపైనే తీవ్రఒత్తిడి ఉందన్న విషయం నాకు తెలుసు. అప్పుడు మీడియా, యావత్ భారత దేశం మొత్తం టీమ్ఇండియాపై భారీ అంచనాలు పెట్టుకోవడంతో ఒత్తిడి వాళ్లకే అనుకున్నా. దీంతో మేం అండర్డాగ్స్లా ఉంటూ ఒత్తిడికి గురికావద్దని భావించా’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
ఇక సెమీఫైనల్కు ముందు తనని పక్కనపెట్టేయడంపై మాట్లాడిన అక్తర్.. ‘మ్యాచ్కు ముందే నేను ఫిట్గా లేనని చెప్పారు. దాంతో వార్మప్ సందర్భంగా మైదానంలోకి వెళ్లి నిరంతరాయంగా 8 ఓవర్లు బౌలింగ్ చేశా. అయినా, నన్ను తుది జట్టులోకి తీసుకోలేదు. ఆ రోజు నేను ఆడి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో తెలియదు. కానీ.. సచిన్, సెహ్వాగ్లను ముందే ఔట్ చేసేవాడిని. వాళ్లిద్దరు ఔటైతే టీమ్ఇండియా కుప్పకూలుతుందని నాకు తెలుసు. చివరికి మ్యాచ్ మొత్తం చూశాక పాక్ ఓటమిపాలవ్వడం నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. అప్పుడు నేను డ్రెస్సింగ్ రూమ్లోని కొన్ని వస్తువులను కూడా పగలగొట్టాను’ అని పేర్కొన్నాడు. కాగా, ఆ మ్యాచ్లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (85; 115 బంతుల్లో 11x4) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)