Shoaib Akhtar: ధోనీ కావాలంటే అలా చేయొచ్చు.. అక్తర్ ఏం చెప్పాడంటే?
ఈ సీజన్లో చెన్నై కథ ముగీయడంతో వచ్చే ఏడాది ధోనీ ఆడతాడా లేదా అనే ప్రశ్న ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది. ఇప్పటికే 40 ఏళ్ల పైబడిన చెన్నై కెప్టెన్ ప్రస్తుత టోర్నీలో కుర్రకారుతో...
ఇంటర్నెట్డెస్క్: ఈ సీజన్లో చెన్నై కథ ముగీయడంతో వచ్చే ఏడాది ధోనీ ఆడతాడా లేదా అనే ప్రశ్న ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది. ఇప్పటికే 40 ఏళ్ల పైబడిన చెన్నై కెప్టెన్ ప్రస్తుత టోర్నీలో కుర్రకారుతో సమానంగా బ్యాటింగ్ చేశాడు. 11 ఇన్నింగ్స్ల్లో 39.80 సగటుతో 132 స్ట్రైక్రేట్తో 199 పరుగులు చేశాడు. అయితే, గతరాత్రి చెన్నై.. ముంబయి చేతిలో ఓటమిపాలవ్వడంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా తప్పుకొంది. ఈ నేపథ్యంలోనే అతడి భవితవ్యంపై పలువురు దిగ్గజాలు స్పందిస్తున్నారు. పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ ధోనీ కావాలంటే వచ్చే ఏడాది కూడా ఆడొచ్చని చెప్పాడు. ఒకవేళ ఆడాలని లేకపోతే మాత్రం చెన్నై జట్టుకు మెంటార్గా లేదా హెడ్కోచ్గా పనిచేయాలని సూచించాడు.
‘ధోనీ విలువైన ఆటగాడు. ఏ నిర్ణయం అయినా అతడిమీదే ఆధారపడింది. అతడు జట్టుతో కలిసి ఆడినా.. లేక జట్టుతో కలిసి ప్రయాణించినా అది చెన్నైకే ఉపయోగం. అయితే, ఈసారి ఆ జట్టు యాజమాన్యం సీరియస్గా ఉన్నట్లు కనిపించలేదు. అసలు ఈసారి జడేజాకు కెప్టెన్సీ ఎందుకిచ్చారో మనకు తెలియదు. అది అర్థంకావట్లేదు. కానీ, వచ్చే సీజన్లో ఆ జట్టు స్పష్టమైన ప్రణాళికతో బరిలోకి దిగాలి’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు. మరోవైపు ధోనీ ఎప్పుడు ఏం చేస్తాడనే విషయాలు ఎవరూ ఊహించలేరని, అతడు ఉన్నపళంగా రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు. అప్పటికప్పుడు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తాడని అక్తర్ పేర్కొన్నాడు. అలాగే మరో సందర్భంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్ స్పందిస్తూ.. ధోనీ ఇప్పటికీ వికెట్ల మధ్య అద్భుతంగా పరుగెడుతున్నట్లు చెప్పాడు. సాధారణ క్రీడాకారుల కన్నా ఈ వయసులోనూ అద్భుతంగా ఆడుతున్నాడని మెచ్చుకున్నాడు. అతడికి ఇంకా ఆడాలని ఉంటే ఇలాగే కొనసాగాలని సూచించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు