Shoaib Akhtar: కోహ్లీ..! నువ్వో సాధారణ ఆటగాడివనే అనుకో..: అక్తర్
బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ గత కొన్నేళ్లుగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అటు అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఇటు ఈ టీ20 టోర్నీలోనూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు...
ఇంటర్నెట్డెస్క్: బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ గత కొన్నేళ్లుగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అటు అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఇటు ఈ టీ20 టోర్నీలోనూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. తాజాగా దిల్లీతో జరిగిన మ్యాచ్లో అతడు 12 పరుగులకే రనౌటవ్వడంతో పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ఓ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ విరాట్కు ఓ సూచన చేశాడు.
‘పరుగులు చేయకపోతే ఎవరినీ ఉపేక్షించేది లేదు. అందుకు కోహ్లీ మినహాయింపేమీ కాదు. అతడు సరిగ్గా ఆడకపోతే పక్కకు పెట్టొచ్చు. అతడి విషయంలో కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పదల్చుకోలేదు. ప్రస్తుతం అతడి బుర్రలో ఎన్నో ఆలోచనలు తిరుగుతుండొచ్చు. అతడో మంచి వ్యక్తి, మంచి ఆటగాడే కాకుండా అతిగొప్ప క్రికెటర్. అయితే, అతడిని నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా. తన మదిలో ఏం అనుకుంటున్నాడో అవన్నీ కాకుండా కేవలం ఒకే విషయం మీద ధ్యాసపెట్టాలని సూచిస్తున్నా. ఎవరు ఏమనుకుంటున్నారనేది వదిలేసి తనని తాను ఒక సాధారణ ఆటగాడిగా భావించాలి. బ్యాట్ తీసుకొని దంచికొట్టడమే పనిగా పెట్టుకోవాలి’ అని అక్తర్ తన అభిప్రాయాలు వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.