Virat Kohli: విరాట్ను పొగిడేందుకు ఇదే కారణం.. షోయబ్ అక్తర్ ఆసక్తికర సమాధానం
భారత క్రికెట్ అంటేనే పాకిస్థాన్ మాజీలు నోరుపారేసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. కానీ, ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) మాత్రం భారత క్రికెటర్లతో స్నేహంగా ఉంటాడు. అప్పడప్పుడు విమర్శలు చేసినా.. వ్యక్తిగత ప్రదర్శనలను మెచ్చుకుంటాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీపై (Virat Kohli) తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు మూడేళ్ల తర్వాత టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ సాధించి మరీ ఫామ్లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం ఆసీస్తో టెస్టు (IND vs AUS) సిరీస్ మినహా.. గతేడాది ఆసియా కప్ నుంచి మొన్న కివీస్ వన్డే సిరీస్ వరకు అదరగొట్టేశాడు. 34 ఏళ్ల వయసులో ఫామ్ తిరిగి అందుకోవడం అసాధారణమైన విషయమని క్రికెట్ విశ్లేషకులు అంటుంటారు. అలాంటిది ఎన్ని విమర్శలు వచ్చినా.. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా బ్యాటింగ్పైనే దృష్టిసారించి మరీ మునుపటి ఫామ్ను సాధించాడు. దీంతో అందరూ ఇప్పుడు పొగడ్తలు కురిపిస్తున్నారు. విరాట్ కోహ్లీని విపరీతంగా అభిమానించే వారిలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) ముందుంటాడు. తానెందుకు విరాట్ ప్రదర్శనను మెచ్చుకుంటానో ఓ చర్చ సందర్భంగా వివరించాడు.
‘‘క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ను ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అని నమ్ముతా. కానీ, కెప్టెన్గా మాత్రం అతడు విఫలమయ్యాడు. దాంతో సారథ్య బాధ్యతలనే వదిలేశాడు. ఇకపోతే నా స్నేహితుడైన విరాట్ కోహ్లీ గురించి మాట్లాడటం చాలా ఇష్టం. అతడి విషయంలోనూ ఇలానే జరిగింది. ఎప్పుడైతే కెప్టెన్సీ భారం లేకుండా స్వేచ్ఛగా ఆడటం మొదలు పెట్టాడో.. ఫామ్లోకి వచ్చేశాడు. అందుకు గత టీ20 ప్రపంచకప్లో అతడి ప్రదర్శన చూస్తే అర్థమైపోతుంది. అతడు తిరిగి ఫామ్లోకి వచ్చాడని చెప్పడానికే ఆ టోర్నమెంట్ అక్కరకొచ్చేలా ఆ దేవుడు చేశాడు. మరొక విషయం.. విరాట్ కోహ్లీని ఎందుకు ఎక్కువగా పొగుడుతుంటావు? అని చాలా మంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. నేనెందుకు మెచ్చుకోకూడదని తిరిగి నేనే వారిని అడుగుతా. ఒక్కసారి విరాట్ రికార్డులు గమనించండి.. అతడు సాధించిన సెంచరీల్లో 40కిపైగా కేవలం ఛేదన సమయంలోనే చేశాడు. ఒకానొక దశలో భారత్ విజయం సాధించడంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు’’ అని షోయబ్ తెలిపాడు. విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు 74 శతకాలను సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.