MS Dhoni: ధోనీ వచ్చే సీజన్ కచ్చితంగా ఆడాలి.. కనీసం అందులోనైనా భాగమవ్వాలి: అక్తర్
కెప్టెన్సీ నుంచి రవీంద్ర జడేజా వైదొలగడంతో మళ్లీ ఎంఎస్ ధోనీ జట్టు పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత సీజన్లో ధోనీ సారథ్యంలో మూడు మ్యాచ్లను...
ఇంటర్నెట్ డెస్క్: కెప్టెన్సీ నుంచి రవీంద్ర జడేజా వైదొలగడంతో మళ్లీ ఎంఎస్ ధోనీ చెన్నై జట్టు పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత సీజన్లో ధోనీ సారథ్యంలో మూడు మ్యాచ్లను చెన్నై ఆడగా.. రెండింటిలో ఘన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ భారీ విజయాలు నమోదు చేస్తే ప్లేఆఫ్స్ అవకాశాలూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు అందరి మదిలో ప్రశ్న ఒకటే.. 40 ఏళ్ల ధోనీ వచ్చే సీజన్లో అందుబాటులో ఉంటాడా..? లేదా..? దీనిపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ తన అభిప్రాయం వెల్లడించాడు.
‘‘వచ్చే సీజన్లో ధోనీ ఉంటాడా..? లేదా అనేది ప్రతి అభిమాని ఆలోచిస్తూ ఉంటాడు. కనీసం చెన్నై మేనేజ్మెంట్లోనైనా భాగం కావాలని కోరుకుంటారు. అయితే ధోనీ ఏం చేస్తాడనేది ఎవరికీ తెలియదు. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేశాడు. టీమ్ఇండియా కోసం ధోనీ చేసిన సేవలకు ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం. గౌరవిస్తూనే ఉంటాం. ఆటకు పూర్తిగా వీడ్కోలు పలకడానికి ముందు కచ్చితంగా వచ్చే సీజన్ను ఆడతాడని నేను భావిస్తున్నా. కనీసం చెన్నై మేనేజ్మెంట్లో అయినా భాగం కావచ్చు. ధోనీ, కోహ్లీ ఓ బ్రాండ్. వాళ్లిద్దరూ ఫ్రాంఛైజీ కంటే ఎక్కువ. ఇప్పటికే ధోనీ యువ ఆటగాళ్లకు చాలా మంచి అవకాశాలు కల్పించాడు. వారి కోసం లోయర్ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ధోనీ వచ్చే ఏడాది కూడా అద్భుతంగా పునరాగమనం చేయాలని కోరుకుంటా’’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.