Shoaib Malik: అప్పుడు క్యాచ్ వదిలేశాం..అదో సరదా సందర్భం!: షోయబ్ మాలిక్
2008లో దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో పాకిస్థానీ క్రికెటర్లు షోయబ్ మాలిక్, సయిద్ అజ్మల్ అత్యంత సులభమైన క్యాచ్ను వదిలేసిన విషయం తెలిసిందే. ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో పాకిస్థానీ క్రికెటర్లు షోయబ్ మాలిక్(Shoaib Malik), అజ్మల్(Saeed Ajmal) అత్యంత సులభమైన క్యాచ్ను వదిలేసిన విషయం తెలిసిందే. ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ‘క్రికెట్ కహానీ’ అనే షోలో హోస్ట్గా వ్యవహరిస్తున్న మాలిక్ దీని గురించి ప్రస్తావిస్తూ అదొక సరదా సందర్భమన్నాడు. పాకిస్థానీ బౌలర్ మహమ్మద్ అమీర్, ఆల్రౌండర్ వాసిమ్ హైదర్లను ఇంటర్వ్యూ చేస్తూ పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2017 సమయంలో ఆ క్యాచ్ గురించి వచ్చిన చర్చను ముందుగా మహమ్మద్ అమీర్ గుర్తు చేశాడు. ‘‘మేము ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గెలిచిన సమయం మీకు గుర్తుందా? సయిద్ అజ్మల్ వదిలేసిన క్యాచ్ గురించి అప్పుడు మీరు మాకు వివరిస్తున్నారు.ఆ సమయంలో విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, అజర్ అలీ, మీరు, నేను అందరం నిల్చొని ఉన్నాం. అతడు ఆ క్యాచ్ను ఎలా వదిలేశాడో మీరు వివరిస్తుంటే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. మీరు చెప్పిన విధానం ఆరోజు నాకు చాలా నవ్వు తెప్పించింది’’ అని అమీర్ తెలిపాడు.
దీనికి మాలిక్ బదులిస్తూ..‘‘ అజ్మల్ అప్పుడు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ సందర్భాన్ని ఎప్పుడు గుర్తు చేసుకున్నా నవ్వొస్తుంది. అతడు కూర్చొని ఉన్నాడు. అతడి చేతులు పువ్వు మాదిరి తెరుచుకొని ఉన్నాయి. అతడు క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ బంతి అతడి చేతులకు దూరంగా పడింది. నా తప్పేంటంటే క్యాచ్ నేను పట్టి ఉండాల్సింది. కానీ నేను అతడి చేతులను చూశాను. క్యాచ్ అందుకోవడం అతడికి చాలా సులభమమని భావించాను. ‘ఆ క్యాచ్ నువ్వు ఎందుకు పట్టుకోలేదు ?’ అని నేను అతడిని ప్రశ్నించాను. దానికి అతడు ‘ ఒకవేళ నువ్వు ఆ క్యాచ్ వదిలేస్తే నేను అందుకుందామని చేతులు చాచి తయారుగా ఉన్నాను’ అని సమాధానమిచ్చాడు. అదొక సరదా సందర్భం. అతడు అందరినీ చాలా నవ్విస్తాడు’’ అని మాలిక్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని