Shreyas Iyer: సూర్యకుమార్ యాదవ్ను వెనక్కి నెట్టి ఆ రికార్డు అందుకున్న శ్రేయస్ అయ్యర్
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల చేసిన భారత క్రికెటర్గా నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (82*) క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్లో అయ్యర్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఫీట్ సాధించాడు. శ్రేయస్ ఇప్పటివరకు 38 ఇన్నింగ్స్ల్లో 1489 పరుగులు చేశాడు. ఇది వరకు ఈ రికార్డు సూర్యకుమార్ యాదవ్ (1424 పరుగులు, 43 ఇన్నింగ్స్లు) పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును శ్రేయస్ బ్రేక్ చేశాడు.
చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన ఛెతేశ్వర్ పుజారా శతకానికి చేరువై 90 పరుగుల వద్ద తైజుల్ ఇస్లామ్ బౌలింగ్లో క్లీన్బౌల్డయ్యాడు. ఈ ఇన్నింగ్స్తో పుజారా ఓ రికార్డును అందుకున్నాడు. వెంగ్ సర్కార్ (6,868) ని అధిగమించి టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఎనిమిదో భారత ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం పుజారా 6,882 పరుగులతో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ (15,921) పరుగులతో టాప్ ప్లేస్లో ఉండగా.. ద్రవిడ్ (13,265), సునీల్ గావస్కర్ (10,122), వీవీఎస్ లక్ష్మణ్ (8,781), సెహ్వాగ్ (8,503), విరాట్ కోహ్లీ (8,075), గంగూలీ (7,212) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
వేధింపులు.. ఊడిగంలో తగ్గేదే లేదు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి