IPL 2022 : శ్రేయస్ అయ్యర్ కోసం ఆ ఫ్రాంఛైజీలు ఎగబడతాయి : ఆకాశ్ చోప్రా
త్వరలో నిర్వహించనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలంలో టీమ్ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ని దక్కించుకునేందుకు చాలా ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయని మాజీ..
ఇంటర్నెట్ డెస్క్ : త్వరలో నిర్వహించనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలంలో టీమ్ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ని దక్కించుకునేందుకు చాలా ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయని మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కోల్కతా లేదా బెంగళూరు జట్లు అతడిని కెప్టెన్గా ఎంపిక చేసుకుంటాయని జోస్యం చెప్పాడు. గత సీజన్ (ఐపీఎల్-2021) వరకు అయ్యర్ దిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తరఫున ఆడిన విషయం తెలిసిందే. భుజం గాయం కారణంగా తొలి విడత ఐపీఎల్కు శ్రేయస్ దూరం కావడంతో.. రిషభ్ పంత్కి కెప్టెన్సీ అప్పగించారు. దుబాయ్లో జరిగిన రెండో విడత ఐపీఎల్కు శ్రేయస్ అందుబాటులోకి వచ్చినా.. పంత్నే కెప్టెన్గా కొనసాగించారు. దీంతో శ్రేయస్ బహిరంగ వేలంలోకి వచ్చాడు.
‘శ్రేయస్ అయ్యర్ గొప్ప ఆటగాడు. జట్టుని సమర్థంగా నడిపించగలడు. అందుకే అతడిని దక్కించుకునేందుకు త్వరలో నిర్వహించనున్న వేలంలో తీవ్ర పోటీ ఉంటుందనడంలో సందేహం లేదు. కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల యాజమాన్యాలు అతడిని కెప్టెన్గా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఎంతైనా వెచ్చించి శ్రేయస్ అయ్యర్ని సొంతం చేసుకునేందుకు చాలా ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే, విదేశీ ఆటగాళ్లు కగిసో రబాడ, క్వింటన్ డికాక్, డేవిడ్ వార్నర్ తదితరులు భారీ ధర పలికే అవకాశముంది’ అని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో పాల్గొననున్న ఆటగాళ్ల జాబితాను ఇటీవలే బీసీసీఐ విడుదల చేసింది. మొత్తం 590 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని