IND vs SA: కావాలనే డీకే కన్నా ముందు అక్షర్ పటేల్ను పంపాం: శ్రేయస్
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్లో దినేశ్ కార్తీక్ కన్నా ముందు అక్షర్ పటేల్ను మైదానంలోకి పంపడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి...
ఇంటర్నెట్డెస్క్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్లో దినేశ్ కార్తీక్ కన్నా ముందు అక్షర్ పటేల్ను మైదానంలోకి పంపడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీమ్ఇండియా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సామాజిక మాధ్యమాల్లో అభిమానులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. డీకే లాంటి హిట్టర్ను కాదని అక్షర్ను ఎందుకు పంపారని మండిపడ్డారు. అయితే, మ్యాచ్ అనంతరం ఈ విషయంపై శ్రేయస్ అయ్యర్ స్పష్టత ఇచ్చాడు.
‘పరిస్థితులకు తగ్గట్టు ఆడేలా ఈ నిర్ణయం మేం ముందే తీసుకున్నాం. అక్షర్ క్రీజులోకి వచ్చేటప్పటికి ఏడు ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఆ సమయంలో మేం సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేసే బ్యాట్స్మన్ కావాలనుకున్నాం కానీ, వచ్చీ రాగానే ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడాలని కోరుకోలేదు. దినేశ్ కార్తీక్ కూడా స్ట్రైక్ రొటేట్ చేయగల ఆటగాడే అయినా.. చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని మేం భావించాం. డీకే కూడా క్రీజులోకి వచ్చాక మొదట కాస్త ఇబ్బందిపడ్డాడు. ఈ మ్యాచ్లో పిచ్ అలాంటి ప్రభావం చూపించింది. అయితే, ఇదే ప్రణాళికను మేం రాబోయే మ్యాచ్లోనూ అమలు చేస్తామని అనుకుంటున్నా. ఇంతకుముందూ మేం ఇలాగే చేశాం. కానీ, ఈ మ్యాచ్లో సరిగ్గా కుదరలేదు’ అని శ్రేయస్ వివరించాడు.
కాగా, ఈ మ్యాచ్లో టీమ్ఇండియా తొలుత బ్యాటింగ్ చేసి 148/6 స్కోర్ సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాట్స్మెన్ తడబడ్డారు. ఈ క్రమంలోనే 13వ ఓవర్లో హార్దిక్ పాండ్య (9) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ 11 బంతుల్లో 10 పరుగులు చేశాడు. ఇక 14వ ఓవర్లో శ్రేయస్(41) ఔటయ్యాక బరిలోకి దిగిన డీకే (30; 21 బంతుల్లో 2x4, 2x6) జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు టీమ్ఇండియా నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు