IPL 2022: శ్రేయస్ సహజంగానే గొప్ప నాయకుడు: డేవిడ్ హస్సీ
కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై ఆ జట్టు మెంటార్ డేవిడ్ హస్సీ ప్రశంసలు కురిపించాడు. శ్రేయస్ సహజంగానే గొప్ప నాయకుడని పేర్కొన్నాడు. ప్రస్తుతం అద్భుత ఫామ్లో ఉన్న అతడిని మరింత స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహిస్తే..
ఇంటర్నెట్ డెస్క్: కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై ఆ జట్టు మెంటార్ డేవిడ్ హస్సీ ప్రశంసలు కురిపించాడు. శ్రేయస్ సహజంగానే గొప్ప నాయకుడని పేర్కొన్నాడు. ప్రస్తుతం అద్భుత ఫామ్లో ఉన్న అతడికి మరింత స్వేచ్ఛ ఇస్తే చాలని హస్సీ అభిప్రాయపడ్డాడు.
‘శ్రేయస్ అయ్యర్లో సహజంగానే నాయకత్వ లక్షణాలున్నాయి. దిల్లీ కెప్టెన్గా గతంలో శ్రేయస్ అయ్యర్ గొప్పగా రాణించాడు. ఆటపై అతడికి మంచి అవగాహన ఉంది. శ్రేయస్ లాంటి యువ ఆటగాడిని కెప్టెన్గా నియమించడం కేకేఆర్ యాజమాన్యం తీసుకున్న గొప్ప నిర్ణయం. ప్రస్తుతం శ్రేయస్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతడిని పట్టించుకోనవసరం లేదు. స్వేచ్ఛనిస్తే చాలు. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమ్మిన్స్ వైస్ కెప్టెన్గా శ్రేయస్కు తోడుగా ఉన్నాడు. అవసరమైతే కమ్మిన్స్ కూడా జట్టును ముందుండి నడిపించగలడు’ అని డేవిడ్ హస్సీ అన్నాడు.
‘అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవటం కాస్త ఆందోళన కలిగించే విషయమే. కానీ, అంతర్జాతీయ క్రికెట్ అన్నింటికంటే ముఖ్యం. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండటంతో.. తొలి ఐదు మ్యాచులకు పాట్ కమ్మిన్స్, ఆరోన్ ఫించ్ అందుబాటులో ఉండరు. ఆ తర్వాతి మ్యాచుల్లో ఇద్దరూ గొప్పగా రాణిస్తారనుకుంటున్నాను’ అని హస్సీ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ బయో బబుల్లో ఉండలేక ఐపీఎల్ ప్రారంభం కాకముందే లీగ్ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో ఆరోన్ ఫించ్ కోల్కతా యాజమాన్యం జట్టులోకి తీసుకుంది.
‘అజింక్య రహానె చాలా అనుభవమున్న ఆటగాడు. అతడిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది. గత కొద్ది కాలంగా అతడు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవమే. కానీ, ట్రైనింగ్ సెషన్లో గొప్పగా రాణిస్తున్నాడు. రహనెలో మంచి నాయకుడు ఉన్నాడు. అలాగే, షెల్డన్ జాక్సన్, సామ్ బిల్లింగ్స్ లాంటి మెరుగైన ఆటగాళ్లు ఉండటం మాకు కలిసొచ్చే అంశం’
బౌలింగ్ విభాగం సమతూకంగా ఉంది..
‘ఉమేష్ యాదవ్ను మళ్లీ జట్టులోకి తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. జట్టు కోసం కష్టపడి పనిచేస్తాడు. అతడితో పాటు టిమ్ సౌథీ, శివమ్ మావి, పాట్ కమిన్స్ వంటి ఫాస్ట్ బౌలర్లు మాకు అందుబాటులో ఉన్నారు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు కూడా ఉన్నారు. మొత్తం మీద బౌలింగ్ విభాగంలో మా జట్టు సమతూకంగా కనిపిస్తోంది’ అని డేవిడ్ హస్సీ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు