Shreyas Iyer : కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని కేకేఆర్ యాజమాన్యం ట్విటర్ వేదికగా..
KKR new captian shreyas iyer : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని కేకేఆర్ యాజమాన్యం ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో కేకేఆర్ యాజమాన్యం అతడిని రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
గతేడాది వరకు శ్రేయస్ అయ్యర్ దిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడాడు. అయితే, గాయం కారణంగా గత సీజన్లో మొదటి విడత ఐపీఎల్కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత దుబాయ్లో జరిగిన మలి దశ ఐపీఎల్కు శ్రేయస్ అందుబాటులోకి వచ్చినా.. దిల్లీ యాజమాన్యం రిషభ్ పంత్నే కెప్టెన్గా కొనసాగించింది. దీంతో శ్రేయస్ బహిరంగ వేలంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
గొప్ప గౌరవం దక్కింది: శ్రేయస్
కోల్కతా జట్టుకు కెప్టెన్గా ఎంపిక అవ్వడంపై శ్రేయస్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘కేకేఆర్ లాంటి ప్రతిష్ఠాత్మక జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. వివిధ దేశాలకు చెందిన అత్యుత్తమ ఆటగాళ్లందరినీ ఐపీఎల్ ఒక చోట చేర్చింది. కెప్టెన్గా కేకేఆర్ జట్టును నడిపించేందుకు ఎదురు చూస్తున్నాను. జట్టు విజయం కోసం శాయశక్తులా కృషి చేస్తాను. ఇంత గొప్ప అవకాశం కల్పించిన జట్టు యాజమాన్యం, సహాయక సిబ్బందికి ధన్యవాదాలు’’ అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు.
‘‘బ్యాటింగ్ నైపుణ్యాలతో శ్రేయస్ అందరినీ ఆకట్టుకున్నాడు. కేకేఆర్ నాయకుడిగా జట్టుని సమర్థంగా నడిపిస్తాడనే విశ్వాసం ఉంది’’ అని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ పేర్కొన్నాడు. ‘‘భారత్కి చెందిన అత్య్తుత్తమ యువ ఆటగాళ్లలో ఒకడైన శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ పగ్గాలు చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు నుంచే శ్రేయస్ ఆటతీరును, నాయకత్వ లక్షణాలను గమనించేవాడిని. ప్రస్తుతం అతడితో కలిసి పని చేసే సమయం వచ్చింది’’ అని కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి