IND VS SA : నేడు ఆఖరి మ్యాచ్.. శ్రేయస్, సిరాజ్లకు చోటు కల్పిస్తారా..?
ఇప్పటిక సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్ సేనకు ఇది నామమాత్రపు మ్యాచే. అయితే టీ20 ప్రపంచకప్ ముందు ప్రయోగాలు చేసి జట్టును పటిష్ఠం చేసుకునేందుకు ఇదో మంచి అవకాశం.
ఇంటర్నెట్ డెస్క్: వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్ఇండియా మంగళవారం ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో చివరి టీ20 మ్యాచ్ ఆడుతోంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్ సేనకు ఇది నామమాత్రపు మ్యాచే. అయితే టీ20 ప్రపంచకప్ ముందు ఉన్న ఆన్ని ఆప్షన్లు చెక్ చేసుకుని, జట్టును పటిష్ఠం చేసుకునేందుకు ఇదో మంచి అవకాశం. అలాగే వరుస మ్యాచ్లు ఆడుతున్న వారికి రెస్ట్ కూడా ఇచ్చినట్లు అవుతుంది. బ్యాటింగ్ విభాగంలో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. డెత్ ఓవర్లలో బౌలర్లు తేలిపోతున్నారు. ఈ నేపథ్యంలో చివరిదైన ఈ మ్యాచ్లో జట్టు కొన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్లకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చారు. దీంతో విరాట్ స్థానం (నెం.3)లో శ్రేయస్ అయ్యర్ని తీసుకునే అవకాశం ఉంది. అయితే రాహుల్కి బదులు ఎవరిని జట్టులోకి తీసుకుంటారు అనేది చూడాలి. రెగ్యులర్ బ్యాటర్ ఎవరూ బెంచ్లో లేరు. ఈ నేపథ్యంలో ఆల్రౌండర్ షాబాద్ అహ్మద్కు ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. అదే జరిగితే భారత్కు అదనపు బౌలర్ ఆప్షన్ కూడా దొరుకుతుంది.
బౌలింగ్ విషయానికొస్తే.. ప్రపంచకప్ జట్టులో ఉన్న అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్కు రెస్ట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్కు అవకాశం వస్తుందా లేదా అనేది తెలియడం లేదు. ఒకవేళ తప్పక చోటు కల్పించాలి అనుకుంటే.. గత మ్యాచ్లో లయ తప్పి ఇబ్బంది పడ్డ అర్ష్దీప్కి ఈ మ్యాచ్లో రెస్ట్ ఇవ్వొచ్చు. మరోవైపు సఫారీ జట్టు ఈ ఒక్క మ్యాచ్లోనైనా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని చూస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
ఐపీఎల్ (IPL) 2024 సీజన్ ఆరంభానికి ముందు సన్రైజర్స్కు షాక్ తగిలింది. హైదరాబాద్ ఆడే తొలి మూడు మ్యాచ్లకు స్పిన్నర్ వానిందు హసరంగ దూరం కానున్నాడు. -
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన క్రికెటర్
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లోని ఇస్లామాబాద్ యునైటెడ్ ఆల్రౌండర్ ఇమాద్ వసీమ్ వివాదంలో చిక్కుకున్నాడు. -
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
కెప్టెన్సీలో రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య ఉన్న పోలికలను భారత యువ కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) వివరించాడు. -
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి నిర్ణయం సరైనదేనా?
Mumbai Indians Captiancy: ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్య... ఈ మార్పు అభిమానులకు సమ్మతమేనా? -
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు