Shreyas Iyer: ధోనీ బ్యాటింగ్ చేస్తుంటే.. టెన్షన్గా ఉంటుంది.: శ్రేయస్
ధోనీ బ్యాటింగ్ చేస్తుంటే ఎప్పుడూ టెన్షన్గా ఉంటుందని కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. గతరాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్లో కోల్కతా ఆరు వికెట్ల తేడాతో విజయం...
ముంబయి: ధోనీ బ్యాటింగ్ చేస్తుంటే ఎప్పుడూ టెన్షన్గా ఉంటుందని కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. గతరాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్లో కోల్కతా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ ధోనీ బ్యాటింగ్పై ఇలా స్పందించాడు. ఈ మ్యాచ్లో తొలుత చెన్నై 131/5 స్కోర్ చేయగా.. కోల్కతా ఆ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించింది. అయితే, చెన్నై ఆ మాత్రం స్కోరైనా సాధించిందంటే అది ధోనీ (50 నాటౌట్; 38 బంతుల్లో 7x4, 1x6) బ్యాటింగ్ వల్లే.
‘ధోనీ అలా ధాటిగా ఆడుతుంటే ఆందోళనకు గురయ్యాను. తేమ కారణంగా ఎప్పుడైనా పరిస్థితులు వారికి అనుకూలంగా మారుతాయని నాకు తెలుసు. అలాంటి సమయంలో బంతిని పట్టుకోవడం చాలా కష్టం’ అని శ్రేయస్ వివరించాడు. ఇక కోల్కతా సారథిగా బాగుందని, కొత్త బాధ్యతలను ఆస్వాదిస్తున్నానని చెప్పాడు. ఇకపై టోర్నీలో ఇలాగే వరుస విజయాలు కొనసాగించాలని ఉందన్నాడు. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ఉమేశ్ యాదవ్పై స్పందిస్తూ.. అతడు నెట్స్లో బాగా కష్టపడ్డాడని, ప్రాక్టీస్ గేమ్స్లోనూ అద్భుతంగా రాణించాడని శ్రేయస్ పేర్కొన్నాడు. ఈరోజు రెండు వికెట్లు తీసి రాణించడం తనకు సంతోషంగా ఉందన్నాడు.
యాజమాన్యానికి కృతజ్ఞతలు: ఉమేశ్
ఉమేశ్ యాదవ్ మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత ఇలా రాణించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ‘నేను చాలా కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడలేదు. అయినా, హెడ్కోచ్, కెప్టెన్ నాపై నమ్మకం ఉంచి తొలి మ్యాచ్లోనే తుది జట్టులోకి తీసుకున్నారు. నేను చాలా రోజులుగా టెస్టు క్రికెట్ ఆడటం వల్ల నా బౌలింగ్ యాక్షన్పై దృష్టిసారించాను. స్వింగ్ రాబట్టడానికి సరైన ప్రదేశాల్లో బంతులేయాలని కష్టపడ్డాను. ఒక ఫాస్ట్ బౌలర్గా తొలి ఓవర్లోనే వికెట్ సాధించడం ద్వారా ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అది ఈరోజు జరిగింది. నేను ఎప్పుడైనా నా ఆటను, ప్రాక్టీస్ సెషన్లను చాలా సీరియస్గా తీసుకుంటా. ఇప్పుడు తొలి మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది’ అని ఉమేశ్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు