ICC: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల.. దూసుకొచ్చిన యువ బ్యాటర్లు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా యువ బ్యాటర్లు రాణించారు. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ ఒక స్థానం కిందకు పడిపోయాడు.

Published : 01 Dec 2022 01:13 IST

దిల్లీ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఉత్తమ ప్రదర్శనకు గాను టీమ్‌ఇండియా యువ ఆటగాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌ మరో ఘనత సాధించారు. ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఈ బ్యాటర్లు తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. 129 పరుగులు సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌.. 6 స్థానాలు దాటుకొని 27వ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. 108 పరుగులు చేసి 3 స్థానాలు ఎగబాకిన శుభ్‌మన్‌ గిల్‌ 34వ ర్యాంక్‌లో నిలిచాడు. 0-1తో ఈ సిరీస్‌ను న్యూజిలాండ్‌ జట్టు సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. అయితే, కివీస్‌తో మ్యాచ్‌లో అర్ధశతకం సాధించినప్పటికీ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ రెండు స్థానాలు కిందకు పడిపోయాడు. ఈ సిరీస్‌కు దూరంగా ఉన్న విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఒక్కో స్థానం కిందకు దిగి 8, 9 ర్యాంకుల్లో నిలిచారు. న్యూజిలాండ్‌ బ్యాటర్లు టామ్‌ లాథమ్‌, కేన్‌ విలియమ్సన్‌ సైతం ఒక స్థానం పురోగతిని సాధించారు. తొలి వన్డేలో ఆ జట్టు 300 పరుగుల లక్ష్యాన్ని అధిగమించడంలో లాథమ్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కేన్‌ సైతం టాప్‌ 10 స్థానంలో చేరాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని