IND vs NZ: రాహుల్ లేని ప్రభావం ఉండదు.. తుది జట్టులోకి శ్రేయస్ : అజింక్య రహానె
టీమ్ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ టెస్టు క్రికెట్ అరంగేట్రం ఖాయమైంది. న్యూజిలాండ్తో జరుగనున్న తొలి టెస్టులో అతడిని జట్టులోకి తీసుకోనున్నట్లు తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె..
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ టెస్టు క్రికెట్ అరంగేట్రం ఖాయమైంది. న్యూజిలాండ్తో జరుగనున్న తొలి టెస్టులో అతడిని జట్టులోకి తీసుకోనున్నట్లు తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె ప్రకటించాడు. పలువురు కీలక ఆటగాళ్లు ఈ సిరీస్కు దూరమైన నేపథ్యంలో సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు కల్పించిన విషయం తెలిసిందే. తొడ గాయం కారణంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ సిరీస్కు దూరమైనట్లు బీసీసీఐ మంగళవారం వెల్లడిండింది. రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ని జట్టులోకి తీసుకుంది. అయితే, జట్టు బ్యాటింగ్ విభాగంలో సమతూకం కోసం శ్రేయస్ అయ్యర్ని కూడా జట్టులోకి తీసుకుంటున్నట్లు అజింక్య రహానె బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించాడు. తొలి టెస్టుకు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు.
గాయంతో కివీస్తో టెస్టు సిరీస్కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్కు టీమ్ఇండియా మేనేజ్మెంట్ చోటు కల్పించింది. ఈ సందర్భంగా రాహుల్ లేని లోటు ఎలా ఉంటుందనే దానిపై కెప్టెన్ అజింక్య రహానె స్పందించాడు. కేఎల్ రాహుల్ లేకపోవడం దెబ్బేనని అయితే భారత ఓపెనింగ్ కాంబినేషన్ మీద ఆ ప్రభావం ఏమాత్రం పడబోదని రహానె స్పష్టం చేశాడు. టీమ్ఇండియా, కివీస్ జట్ల మధ్య తొలి టెస్టు గురువారం (నవంబర్ 25) నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ సిరీస్లో రాహుల్ అద్భుతంగా రాణించాడని, అయితే ఈ సిరీస్కు లేకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదని రహానె పేర్కొన్నాడు. టీమ్ఇండియాకు మంచి యువ క్రికెటర్లు అందుబాటులో ఉన్నారని, వారిలో ఒకరు ఓపెనింగ్ స్థానాన్ని భర్తీ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
రాహుల్ ద్రవిడ్ కోచ్గా రావడంపై రహానె స్పందిస్తూ.. ‘‘రాహుల్ ద్రవిడ్ ఒక్కటే చెప్పాడు. ఎక్కువ ఆలోచించకుండా మా శైలిలో ఆడాలని సూచించాడు. పుజారాకు, నాకు గేమ్ ప్లాన్ ఏంటో తెలుసు. దానిని మైదానంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లేకపోవడం యువ క్రికెటర్లకు సదావకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవడానికి బాగా ఆడాలి. స్వేచ్ఛగా ఆడితే వాటంతటవే పరుగులు వచ్చేస్తాయి. అలానే ఇక్కడి పరిస్థితులు వేరు, దక్షిణాఫ్రికాలో పరిస్థితులు వేరేగా ఉంటాయి. కాబట్టి మేం మొదట కివీస్తో టెస్టు సిరీస్పైనే దృష్టిసారించాం’’ అని రహానె వివరించాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దూరం కావడంతో.. మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. పేస్ విభాగంలో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లతో టీమ్ఇండియా బరిలోకి దిగనుంది.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..