Wasim Jaffer: ‘టీమ్ఇండియాలో విరాట్ కోహ్లీ తర్వాత అతడే స్టార్ ఆటగాడు’
భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ తర్వాత శుబ్మన్ గిల్ స్టార్ ఆటగాడిగా నిలుస్తాడని టీమ్ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ కితాబిచ్చాడు. తన దృష్టిలో అతడు మూడు ఫార్మాట్లు ఆడగలిగే ప్లేయర్ అని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్మన్ గిల్ బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో రాణించాడు. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులో వచ్చిన గిల్ బంగ్లాపై తొలి ఇన్నింగ్స్లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్లో సత్తా చాటాడు. 147 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుని 110 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. టెస్టుల్లో అతడికిదే మొదటి సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో శుభ్మన్ గిల్పై భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ తర్వాత శుభ్మన్ గిల్ స్టార్ ఆటగాడిగా నిలుస్తాడని కితాబిచ్చాడు. తన దృష్టిలో అతడు మూడు ఫార్మాట్లు ఆడగలిగే ప్లేయర్ అని పేర్కొన్నాడు.
‘గిల్కు ఇంతకు ముందు కొన్ని అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పటికైనా గిల్ టెస్టుల్లో తొలి సెంచరీ సాధించడం సంతోషంగా ఉంది. అతడో క్లాస్ ప్లేయర్. టీమ్ఇండియాలో విరాట్ కోహ్లీ తర్వాత అంతటి స్థాయి ఆటగాడిగా ఎదుగుతాడని నేను భావిస్తున్నా. అతడు మూడు ఫార్మాట్లలో ఆడగలిగే సత్తా ఉన్న ప్లేయర్. బంగ్లాతో రెండో టెస్టు కోసం రోహిత్ శర్మ జట్టులోకి వచ్చినా గిల్ని తుది జట్టులో ఉంచుతారని భావిస్తున్నా. ఓపెనర్లు మిడిల్ ఆర్డర్లో ఆడటం పెద్ద విషయమేమీ కాదు. గతంలో గిల్ పంజాబ్ జట్టుకు ఆ స్థానంలో ఆడాడు. అతడు ఐదు లేదా మరే స్థానంలోనైనా ఆడేందుకు సరిపోతాడు’ అని జాఫర్ వివరించాడు.
గిల్తో కేఎల్కు రాహుల్కు ఇబ్బంది: ఆకాశ్ చోప్రా
శుభ్మన్ గిల్ ఫామ్లోకి రావడం కేఎల్ రాహుల్కు సమస్యగా మారుతుందని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. బంగ్లాతో తొలి టెస్టులో కేఎల్ రాహుల్ రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమైన సంగతి తెలిసిందే. రెండో టెస్టు కోసం కెప్టెన్ రోహిత్ అందుబాటులో ఉంటాడని సమాచారం. అదే జరిగితే రోహిత్కి ఓపెనింగ్ జోడీగా ఎవరస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గిల్ ఫామ్ కేఎల్కు సమస్యగా మారొచ్చని పేర్కొన్నాడు. ‘కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడు. కానీ, రెండు ఇన్నింగ్స్ల్లోనూ తక్కువ స్కోరుకే ఔట్ కావడం అతడికి ఇబ్బందిగా మారింది. మరోవైపు, శుభ్మన్ గిల్ శతకంతో రాణించాడు. రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తే ఎవరు బయటకు వెళ్తారు? వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గిల్ని పక్కన పెడతారా?’అని ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు.
ఆ అనుభూతిని ఆస్వాదించనివ్వండి: అజయ్ జడేజా
టెస్టు కెరీర్లో తొలి శతకం బాదిన శుభ్మన్ గిల్ని భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా ప్రశంసించాడు. ‘టెస్ట్ క్రికెట్లో సెంచరీ సాధించడం అనేది చాలా ప్రత్యేకమైనది. ఆ అనుభూతి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే.. కానీ చాలా ముఖ్యమైనది. సెంచరీ చేయడం అనేది పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లే. ఇది అలాంటి ప్రభావాన్నే చూపుతుంది. శుభ్మన్ గిల్ ఆ అనుభూతిని ఆస్వాదించనివ్వండి. 18 సెంచరీలు బాదిన ఛెతేశ్వర్ పుజారా దాదాపు నాలుగేళ్ల తర్వాత సెంచరీ చేశాడు. ఇదొక విభిన్నమైన అనుభూతి ’ అని అజయ్ జడేజా అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...