IND vs AUS: గిల్, సూర్యకుమార్.. ఇద్దరిలో ఎవరు? రోహిత్ ఏమన్నాడంటే?
ఆసీస్తో తొలి టెస్టుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాట్లాడాడు.
నాగ్పుర్: ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆసీస్ మధ్య బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy) ప్రారంభంకానుంది. నాగ్పుర్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే ఈ సిరీస్ భారత్కు కీలకం కానుంది. సిరీస్కు ఎంపికైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో తొలి టెస్టుకు దూరం అయ్యాడు. దీంతో ఆ స్థానం కోసం ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో గిల్, సూర్యకుమార్ల ఎంపిక గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు.
‘శుభ్మన్ గిల్ (Shubman Gill) అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతడు ఈ మధ్య భారీ శతకాలు బాదాడు. మరోవైపు, సూర్యకుమార్ యాదవ్ కూడా తనెంటో నిరూపించుకున్నాడు. కానీ, వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’ అని రోహిత్ శర్మ వివరించాడు. కారు ప్రమాదంలో గాయపడి బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి దూరమైన రిషభ్ పంత్ గురించి కూడా రోహిత్ మాట్లాడాడు. ‘మేం రిషభ్ పంత్ సేవలను కోల్పోతున్నాం. కానీ, అతడి పాత్రను పూర్తి చేయడానికి మా దగ్గర ఆటగాళ్లున్నారు. మేం వారితో మాట్లాడి ప్రణాళికల గురించి తెలుసుకున్నాం. రేపటి నుంచి వాటి అమలుపరుస్తాం’ అని హిట్మ్యాన్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు