Virat Kohli: నాడు సచిన్.. నేడు కోహ్లీ ఇలానే..!
సచిన్ టెండూల్కర్ 100వ సెంచరీ పూర్తి చేసిన సందర్భంగా 2012లో భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అందులో బాలీవుడ్, క్రికెట్
ఏడాదిలో తానేమిటో నిరూపించుకున్న లిటిల్ మాస్టర్
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
సచిన్ టెండూల్కర్ 100వ సెంచరీ పూర్తి చేసిన సందర్భంగా 2012లో భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అందులో బాలీవుడ్, క్రికెట్ నుంచి హేమాహేమీలు పాల్గొన్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘సచిన్ రికార్డును బ్రేక్ చేయడం కష్టమే కాదు.. అసాధ్యం.. ఇది డాన్ చెప్పట్లేదు.. నేను చెబుతున్నాను. మీ 100 సెంచరీల రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారనుకుంటున్నారు?.. ఎవరూ చేయలేరని చెప్పండి..!’’ అని సచిన్ను ప్రశ్నించారు. దీనికి సచిన్ నవ్వుతూ ‘‘ఈ గదిలోనే ఉన్నారు.. వారు విరాట్, రోహిత్..! ఎవరైనా భారతీయులు నా రికార్డు బద్దలు కొడితే సంతోషిస్తాను’’ అని పేర్కొన్నారు. అక్కడి సీన్ కట్ చేస్తే..
కాలచక్రం గిర్రున తిరిగింది. సచిన్ అంచనాలు నిజమయ్యే పరిస్థితి వచ్చింది. విరాట్, రోహిత్లు పోటీలు పడి పలు రికార్డులు బద్దలు కొట్టారు. విరాట్ కోహ్లీ మైదానంలో చిరుతలా కదులుతాడు.. రోహిత్ కొంచెం బద్దకంగా కనిపించినా బంతిని అలవోకగా స్టాండ్స్ దాటించడంలో దిట్ట. ప్రస్తుత వన్డే జట్టులో అధిక శతకాలు విరాట్ పేరిట ఉంటే.. అత్యధికంగా మూడు ‘ద్విశతకాలు’ రోహిత్ సాధించాడు. ప్రతిభలో ఎవరికెవరూ తీసిపోరు. ప్రస్తుతం టీమిండియాకు వీరు మూలస్తంభాలు. కానీ, ఈ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు గత కొన్ని నెలలుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఆజ్యం పోసేట్లు తాజాగా ఒకరి కెప్టెన్సీలో ఆడేందుకు మరొకరు ఇష్టపడక జట్టు నుంచి తప్పుకొన్నట్లు వార్తలొస్తున్నాయి. భారత క్రికెట్లో ఇలాంటి ప్రచారాలు కొత్తేమీ కాదు. గతంలో సునీల్ గావాస్కర్-కపిల్దేవ్, గంగూలీ-ద్రవిడ్, ధోనీ-సెహ్వాగ్ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినట్లు బలమైన ప్రచారం జరిగింది.
బీసీసీఐ ట్వీట్లతో ఊహాగానాలకు ఊతం..!
విరాట్-రోహిత్ మధ్య పొసగడంలేదనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. 2007లో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టగా.. ఆ మరుసటి సంవత్సరమే కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత దశాబ్దం పాటు వీరు రికార్డుల హోరుతో భారత్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించారు. పరస్పరం వ్యతిరేకంగా ఒక్క విమర్శ లేదా ప్రకటన చేసిన దాఖలాలు లేవు. రోహిత్ టీమిండియాకు దొరికిన ఓ వరమని అంగీకరించడంలో కోహ్లీ ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. వీరిద్దరు కొన్నేళ్లుగా కలిసి ఆడారు. ఈ నేపథ్యంలో ఒక్క వివాదాస్పద ఘటన కూడా చోటుచేసుకోలేదు.
పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి టీ20 వరల్డ్కప్ తర్వాత వైదొలగుతానని కోహ్లీ సెప్టెంబర్లోనే బాంబుపేల్చాడు. విరాట్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో బీసీసీఐ వెంటనే ప్రకటించలేదు. కానీ, న్యూజిలాండ్తో 3మ్యాచ్ల సిరీస్కు రోహిత్కు కెప్టెన్సీ ఇచ్చింది. ఈ సిరీస్కు విరాట్ విశ్రాంతి తీసుకొన్నాడు. తొలి టెస్టులో కూడా ఆడలేదు. భారత్ ఈ సిరీస్లో విజయం సాధించింది. అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన టెస్టు జట్టులో రహానేను కొనసాగించినా.. అతడిని వైస్ కెప్టెన్గా పక్కనపెట్టారు. ఆ స్థానంలో రోహిత్ను నియమించారు. టెస్టు కెప్టెన్గా విరాట్ను కొనసాగించారు. కానీ, ఒక్క నిమిషం తర్వాత బీసీసీఐ చేసిన ట్వీట్ పుకార్లకు ఆజ్యం పోసింది. టీ20, వన్డే సిరీస్కు రోహిత్ను కెప్టెన్గా నియమిస్తన్నట్లు దానిలో ప్రకటించింది.
అప్పటికి కొన్నాళ్ల క్రితమే వన్డే, సుదీర్ఘ ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతల్లో కొనసాగుతానని సోషల్ మీడియాలో విరాట్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అతడిని తొలగించినట్లు ప్రకటించింది. వన్డే కెప్టెన్సీపై ఆసక్తిగా ఉన్నా.. కోహ్లీని బలవంతంగా తొలగించినట్లు ప్రచారం ఊపందుకోవడంతో కొన్ని గంటల్లోనే బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. విరాట్ను టీ20 ఫార్మాట్లో కొనసాగాలని కోరానని.. సెలక్టర్లు రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను కోరుకోవడంలేదని వెల్లడించినట్లు వివరణ ఇచ్చాడు. వన్డే కెప్టెన్సీ వదులుకోవడానికి విరాట్కు 48గంటల సమయం ఇచ్చి.. ఆ తర్వాత ఒక ట్వీట్తో తొలగించారనే ప్రచారం జరిగింది. అయితే అప్పుడు విరాట్ వైపు నుంచి ఎటువంటి వివరణ రాలేదు.
మరోవైపు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ 13వ తేదీన బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ మాజీ కెప్టెన్ విరాట్ను ప్రశంసలతో ముంచెత్తాడు. భవిష్యత్తులో టీమ్ ఇండియా ప్రతి మ్యాచ్లో విజయం సాధించేందుకు కృషి చేస్తుందన్నాడు. అనంతరం సుదీర్ఘ ఫార్మాట్ వైస్ కెప్టెన్ బాధ్యతల్లో ఉన్న రోహిత్.. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టులకు అందుబాటులో ఉండటంలేదన్న విషయం బయటకొచ్చింది. ఇది జరిగిన మర్నాడే విరాట్ వన్డే సిరీస్కు అందుబాటులో లేడనే ప్రచారం మొదలైంది. విరాట్, రోహిత్లు నిజమైన కారణాలతో సిరీస్కు దూరమైనా.. ప్రస్తుత పరిస్థితులు పుకార్లకు అవకాశం ఇస్తున్నాయని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ పేర్కొన్నారు. చిన్న విషయాలను భూతద్దంలో చూస్తున్నట్లు అభిప్రాయపడ్డాడు. జెంటిల్మెన్ గేమ్గా పేరున్న క్రికెట్లో ఇలాంటి వివాదాలను ముగించేలా అటు బీసీసీఐగానీ, ఇటు ఆటగాళ్లు కానీ ప్రకటన చేయడం ఉత్తమం. తాజాగా కోహ్లీ కూడా అదే చేశాడు. రోహిత్ను మెచ్చుకుంటూ.. వన్డే సిరీస్కు తాను అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. టెస్టుజట్టు ఎంపికకు కేవలం గంటన్నర ముందు మాత్రమే వన్డే నాయకత్వం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారని తెలిపాడు.
రెండున్న దశాబ్దాల క్రితం సచిన్ కూడా ఇలానే..
దాదాపు రెండున్న దశాబ్దాల క్రితం 1997లో సచిన్ను కూడా బీసీసీఐ అర్ధాంతరంగా నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించింది. దీనిని సచిన్ అవమానకరంగా భావించాడు. ‘‘నన్ను కెప్టెన్గా తొలగించినప్పుడు బీసీసీఐ నుంచి ఎవరూ సంప్రదించలేదు.. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. మీడియా మిత్రుడు ఒకరు కాల్ చేసి నన్ను కెప్టెన్సీ నుంచి తొలగించినట్లు వెల్లడించారు’’ అని తన జీవిత చరిత్ర ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లో సచిన్ గుర్తు చేసుకొన్నారు. ఈ ఘటనను సచిన్ చాలా అవమానకరంగా భావించాడు. కానీ, క్రికెట్లో లిటిల్ మాస్టర్ది భిన్నమైన శైలి. వివాదాలకు.. పుకార్లకు దూరంగా ఉంటాడు. భావోద్వేగాలను ఆటపై పడనీయడు. కెప్టెన్సీ తొలగింపు తర్వాత బాగా ఆడాలనుకుని మాస్టర్ బ్లాస్టర్ నిశ్చయించుకొన్నాడు. ఆ ఫలితమే..
1998లో టెస్టులు, వన్డేల్లో కలిపి ఏకంగా డజను శతకాలు చేసి తానేమిటో ప్రపంచానికి చాటాడు. తన రికార్డులు బద్దలు కొట్టగలరని సచిన్ విశ్వసించిన విరాట్-రోహిత్లు కెప్టెన్సీ విషయంలో అనవసర వివాదాలకు దూరంగా ఉంటూ సగటు అభిమానికి తమ ఆట తీరుతో కనువిందు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...