వేటకు సిద్ధమైన సింధు.. అదే దారిలో శ్రీకాంత్
ప్రపంచ విజేత పీవీ సింధు మునుపటి ఫామ్ అందుకోవాలని తహతహలాడుతోంది. ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. స్విస్ ఓపెన్ ఫైనల్లో కరోలినా మారిన్ చేతిలో ఆమె ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆకలిగొన్న పులిలా కనిపిస్తున్న...
బర్మింగ్హామ్: ప్రపంచ విజేత పీవీ సింధు మునుపటి ఫామ్ అందుకోవాలని తహతహలాడుతోంది. ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. స్విస్ ఓపెన్ ఫైనల్లో కరోలినా మారిన్ చేతిలో ఆమె ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆకలిగొన్న పులిలా కనిపిస్తున్న సింధు తన పొరపాట్లను సరిచేసుకొని గట్టిగా పోరాడాలని నిర్ణయించుకుంది. ఆమెతో పాటు సైనా నెహ్వాల్, శ్రీకాంత్, కశ్యప్ ఆల్ ఇంగ్లాండ్తో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
స్విస్ ఓపెన్ గెలిచిన మారిన్ గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. ఒలింపిక్స్ అర్హత టోర్నీ కాకపోవడంతో చైనా, కొరియా, చైనీస్ తైపీ ప్రధాన షట్లర్లు సైతం రావడం లేదు. అందుకే పతకాలు గెలిచేందుకు ఇదో సువర్ణావకాశంగా టీమ్ఇండియా భావిస్తోంది. ప్రకాశ్ పదుకొణె (1980), పుల్లెల గోపీచంద్ (2001) తర్వాత ఆ ఘనతను అందుకోవాలన్న పట్టుదలతో ఉంది. 2015లో సైనా నెహ్వాల్ రజతం గెలవగా, 2018లో పీవీ సింధు సెమీస్లో ఓటమి పాలవ్వడం గమనార్హం.
ఆల్ ఇంగ్లాండ్ పతకానికి సింధు ప్రధాన పోటీదారుగా ఉంది. సైనా మాత్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. రెండేళ్లుగా ఆమె కేవలం రెండు క్వార్టర్ ఫైనళ్లు మాత్రమే ఆడింది. పురుషుల మాజీ ప్రపంచ నంబర్వన్ కిదాంబి శ్రీకాంత్, పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టికీ అవకాశాలున్నాయి. స్విస్ ఓపెన్లో వీరి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఐదో సీడ్గా బరిలోకి దిగుతున్న సింధు తొలి రౌండ్లో మలేసియా షట్లర్ సోనియా చెహ్తో తలపడనుంది. క్వార్టర్ ఫైనల్లో అకానె యమగూచితో పోటీపడాల్సి రావొచ్చు. ఏడో సీడ్ సైనా డెన్మార్క్ అమ్మాయి మియా బ్లిచ్ఫెల్ట్తో తలపడనుంది. రెండో రౌండ్లో స్కాట్లాండ్కు చెందిన గిల్మోర్తో పోటీ పడాల్సి రావొచ్చు.
పురుషుల సింగిల్స్లో ఇండోనేసియాకు చెందిన టామీ సుగియార్తోతో శ్రీకాంత్ తలపడతాడు. ఫ్రాన్స్ షట్లర్ టోమా జూనియర్ పాపొవ్తో బి.సాయిప్రణీత్ పోటీపడతాడు. ఆ తర్వాత అతడు రెండో సీడ్ విక్టర్ అక్సెల్సన్ను ఢీకొట్టాల్సి రావొచ్చు. కామన్వెల్త్ క్రీడల విజేత పారుపల్లి కశ్యప్ ప్రస్తుత నంబర్వన్ కెంటా మొమొటా (జపాన్)తో పోరు ఆరంభిస్తాడు. కారు ప్రమాదానికి గురైన మొమొటా పూర్తి స్థాయి ఫిట్నెస్తో లేడు. హెచ్ఎస్ ప్రణయ్ డారెన్ ల్యూ (మలేసియా), సమీర్ వర్మ కొయిల్హో (బ్రెజిల్), లక్ష్య సేన్ కెంటాఫోన్ వాంగ్చారోయిన్తో తొలిరౌండ్లో పోటీపడనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.