P V Sindhu : జర్మన్ ఓపెన్.. రెండో రౌండ్లోకి ప్రవేశించిన సింధు, శ్రీకాంత్
జర్మనీలో జరుగుతున్న జర్మన్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్లోకి..
ఇంటర్నెట్ డెస్క్: జర్మనీలో జరుగుతున్న జర్మన్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మంగళవారం జరిగిన మ్యాచులో ఏడో సీడ్ సింధు.. థాయ్లాండ్కు చెందిన బుసానన్పై 21-8, 21-7 వరుస సెట్లలో విజయం సాధించింది. 32 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచులో సింధు పూర్తి ఆధిపత్యం చలాయించింది. ప్రత్యర్థి బుసానన్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బుసానన్పై సింధుకి ఇది 15వ విజయం కావడం గమనార్హం. సింధు తన తర్వాతి మ్యాచులో స్పెయిన్కి చెందిన బియట్రిజ్ కొరలెస్తో గానీ, చైనాకు చెందిన ఝాంగ్ యి మన్తో గానీ తలపడే అవకాశం ఉంది.
ఎనిమిదో సీడ్ కిదాంబి శ్రీకాంత్ మరో మ్యాచులో ఫ్రాన్స్కు చెందిన ప్రత్యర్థి బ్రైస్ లావెర్డెజ్ని ఓడించాడు. 48 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచులో శ్రీకాంత్ 21-10, 13-21, 21-7 తేడాతో గెలుపొందాడు. తొలి సెట్లో వెనుకబడిన లావెర్డెజ్.. రెండో సెట్లో గొప్పగా పుంజుకుని శ్రీకాంత్పై పై చేయి సాధించాడు. నిర్ణయాత్మక మూడో సెట్లో శ్రీకాంత్ మునుపటి లయను అందుకుని విజయం సాధించాడు. లావెర్డెజ్పై శ్రీకాంత్కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. తర్వాతి మ్యాచులో చైనాకు చెందిన లు గ్వాగ్ జుతో శ్రీకాంత్ తలపడనున్నాడు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్లో భారత జోడీకి తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. కె.సాయి ప్రతీక్, ఎన్. సిక్కి రెడ్డి జోడీ ఆరంభ మ్యాచులో టాప్ సీడ్ డెచాపోల్, సప్సిరీ జంటపై 19-21, 8-21 తేడాతో ఓటమి పాలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
-
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి