స్విస్‌ ఓపెన్‌: మారిన్‌ చేతిలో సింధు ఓటమి

స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్లో తెలుగు తేజం పీవీ సింధు నిరాశ పరిచింది. స్పెయిన్‌కు చెందిన క్రీడాకారిణి కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో ఓటమి.......

Updated : 07 Mar 2021 21:12 IST

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్లో తెలుగు తేజం పీవీ సింధు నిరాశ పరిచింది. స్పెయిన్‌కు చెందిన క్రీడాకారిణి కరోలినా మారిన్‌ చేతిలో ఓటమి పాలైంది. వరుస సెట్లలో 12-21, 5-21 తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. 35 నిమిషాల్లోనే ఆట ముగిసింది. మారిన్‌ చేతిలో సింధుకు ఇది మూడో ఓటమి. దాదాపు 18 నెలల తర్వాత సింధు తొలిసారి ఫైనల్‌ ఆడగా.. మారిన్‌ ఇదే ఏడాదిలో మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. సింధు తదుపరి మార్చి 17 నుంచి 21 వరకు జరిగే ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొననుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని