Pink Test: ఇది అస్సలు ఊహించలేదు: స్మృతి
తాను డే/నైట్ టెస్టు ఆడతానని ఎన్నడూ ఊహించలేదని టీమ్ఇండియా మహిళా ఓపెనర్ స్మృతి మంధాన పేర్కొంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల జట్టు, కంగారూలతో ఓ టెస్టు మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: తాను డే/నైట్ టెస్టు ఆడతానని ఎన్నడూ ఊహించలేదని టీమ్ఇండియా మహిళా ఓపెనర్ స్మృతి మంధాన పేర్కొంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల జట్టు, కంగారూలతో ఓ టెస్టు మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. దాన్ని ఇటీవలే డే/నైట్ టెస్టుగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే స్మృతి ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యలు చేసింది. పురుషుల డే/నైట్ టెస్టులు చూసేటప్పుడు తమ జట్టూ ఇలా ఆడుతుందని అనుకోలేదని, తమకోసం కూడా ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా సంతోషించినట్లు చెప్పింది.
‘నా తొలి డే/నైట్ వన్డే ఆడటం ఇంకా గుర్తుంది. చిన్నపిల్లలా ఎంతో సంతోషించాను. మేం డే/నైట్ మ్యాచ్ ఆడబోతున్నాం అని సంబరపడ్డాను. ఇప్పుడు టెస్టుల్లో అలాంటి ఆట ఆడటం చాలా ఉత్సాహంగా ఉంది. కానీ అంతకుముందు మేం అనేక విషయాలపై దృష్టి సారించాలి. ఆస్ట్రేలియా జట్టుతో వారి సొంతగడ్డపైనే ఆడటం సవాలుతో కూడుకున్నది. అది మా జట్టు సభ్యులందరికీ ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. అలాగే ఇంగ్లాండ్తో ఒక టెస్టు ఆడుతున్నామని తెలిసి మా అమ్మాయిలంతా సంతోషం వ్యక్తం చేశారు. నేను చివరిసారి 2014లో టెస్టు మ్యాచ్ ఆడాను. దాంతో ఏడేళ్ల తర్వాత తెల్ల దుస్తుల్లో క్రికెట్ ఆడటం అనేది మరింత ఆనందంగా ఉంది’ అని స్మృతి చెప్పుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.