Ajinkya Rahane : ఆస్ట్రేలియా పర్యటనలో నా నిర్ణయాలకు.. వేరెవరో క్రెడిట్ తీసుకున్నారు : అజింక్య రహానె
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు అజింక్య రహానె సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో తాను తీసుకున్న నిర్ణయాలకు వేరెవరో క్రెడిట్ తీసుకున్నారని ఆరోపించాడు. 2020-21..
ఇంటర్నెట్ డెస్క్ : టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు అజింక్య రహానె సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో తాను తీసుకున్న నిర్ణయాలకు వేరెవరో క్రెడిట్ తీసుకున్నారని ఆరోపించాడు. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీతో అజింక్య రహానె తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఘోర పరాజయం తర్వాత కోహ్లీ పితృత్వ సెలవుపై భారత్కి తిరిగొచ్చాడు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టిన రహానె.. జట్టుని విజయపథంలో నడిపించాడు. ఆ తర్వాత జరిగిన మూడు టెస్టులకు సారథ్యం వహించిన రహానె.. 2-1తో టెస్టు సిరీస్ను సొంతం చేసుకుని భారత్ని విజేతగా నిలిపాడు. అప్పటి పర్యటనపై తాజాగా అతడు స్పందించాడు. ‘బ్యాక్స్టేజ్ విత్ బొరియా’ అనే కార్యక్రమంలో మాట్లాడిన అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘ఆస్ట్రేలియా పర్యటనలో నేను ఏం చేశానో అందరికీ తెలుసు. ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విజయం గురించి చెప్పుకుని.. క్రెడిట్ కొట్టేయాలనుకోవడం నా స్వభావం కాదు. మైదానంలో నేను తీసుకున్న నిర్ణయాల వల్లే భారత్ గొప్ప విజయాలు సాధించింది. కానీ, వాటికి క్రెడిట్ వేరెవరో తీసుకున్నారు. ఏదేమైనా, మా జట్టు సిరీస్ గెలవడం చాలా ముఖ్యం. ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన చారిత్రక టెస్టు సిరీస్ నాకు చాలా ప్రత్యేకమైనది. ఆ విజయం తర్వాత ‘నా వల్లే ఇది సాధ్యమైంది.. నేను తీసుకున్న నిర్ణయాలే విజయానికి ప్రధాన కారణం’ అని కొందరు మీడియాలో చెప్పుకున్నారు. మైదానంలో పరిస్థితులను బట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నానో నాకు తెలుసు. వాటి గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు. కానీ, అవన్నీ నా సొంతంగా తీసుకున్నవే. అలా చెయ్, ఇలా చెయ్ అని నాకెవరూ చెప్పలేదు’ అని అజింక్య రహానె పేర్కొన్నాడు.
రహానె ప్రత్యేకించి ఎవరి పేరును ప్రస్తావించలేదు. అయితే, అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రిని లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రవిశాస్త్రి ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో పదే పదే ఈ విజయం గురించి చెప్పుకున్న విషయం తెలిసిందే. క్లిష్ట పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టి.. సమర్థంగా జట్టుని నడిపించిన రహానెపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు.
* నా సామర్థ్యంపై నమ్మకం ఉంది..
‘నా ఫామ్పై వస్తున్న విమర్శలను చూసి నవ్వుకుంటాను. ఆట గురించి తెలియని వాళ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. వాటి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు, ఆ తర్వాత టెస్టుల్లో నేను రాణించిన తీరు గురించి మాట్లాడాలనుకోవడం లేదు. కానీ, ఆస్ట్రేలియా పర్యటన నా కెరీర్లో మరిచిపోలేనిది. ఆట గురించి తెలిసిన వాళ్లు, ఆట పట్ల అభిమానం ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. నా సామర్థ్యంపై పూర్తి నమ్మకముంది. మునుపటి ఫామ్ అందుకుని బ్యాటుతో సత్తా చాటగలను. నాలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది’ అని అజింక్య రహానె చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు