Sourav Ganguly: వన్డేల్లో.. ఒకే ఒక్కడు!
పరుగులు చేయడంలో.. సిక్సర్లు దంచడంలో.. ప్రత్యర్థిని ఢీకొట్టడంలో కోల్కతా ప్రిన్స్ ఆధిపత్యం తెలియనిది ఎవరికి? మ్యాచ్ ఫిక్సింగ్ కళంకంతో విశ్వాసం కోల్పోయిన భారత క్రికెట్కు ఊపిరులూదిన బెంగాల్...
ఇంతకు మించి దాదాగిరీ ఉంటుందా?
పరుగులు చేయడంలో.. సిక్సర్లు దంచడంలో.. ప్రత్యర్థిని ఢీకొట్టడంలో కోల్కతా ప్రిన్స్ ఆధిపత్యం తెలియనిది ఎవరికి? మ్యాచ్ ఫిక్సింగ్ కళంకంతో విశ్వాసం కోల్పోయిన భారత క్రికెట్కు ఊపిరులూదిన బెంగాల్ టైగర్ సంగతి తెలియనిది ఎవరికి? అయితే, అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా నాలుగు మ్యాన్ ఆఫ్ ది మ్యాచులు గెలిచిన ఏకైక క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఒక్కడేనని ఈ తరంలో ఎంతమందికి తెలుసు? అందుకే అప్పటి దాదాగిరిని మరొక్కసారి గుర్తు చేసుకుందాం!!
గణాంకాలన్నీ దాదావే
1997, సెప్టెంబర్.. టీమ్ఇండియా కెనడాలో పర్యటించింది. దాయాది పాకిస్థాన్తో 5 వన్డేల్లో తలపడింది. 4-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకొంది. శత్రు దేశాన్ని చిత్తుచిత్తుగా ఓడించింది. ఆ ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు సౌరవ్ గంగూలీ. ఆ సిరీసు గణాంకాల్లో ఆధిపత్యం కోల్కతా ప్రిన్స్దే. అటు బ్యాటు.. ఇటు బంతితో దాదాగిరి చేశాడు. 5 ఇన్నింగ్సుల్లో 55.50 సగటుతో 62.01 స్ట్రైక్రేట్తో 222 పరుగులు చేశాడు. 2 అర్ధశతకాలతో టాప్ స్కోరర్గా నిలిచాడు. సక్లెయిన్ ముస్తాక్ వంటి దిగ్గజ బౌలర్ 9 వికెట్లు తీస్తే గంగూలీ ఏకంగా 15 వికెట్లు పడగొట్టాడు. 48.5 ఓవర్లు వేస్తే అందులో 9 మొయిడిన్. ఇక సగటు 10.66, ఎకానమీ 3.27. ఒక మ్యాచులో కేవలం 16 పరుగులిచ్చి 5 వికెట్లతో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఎక్కువ ఓవర్లు వేసి తక్కువ పరుగులు (160) ఇచ్చిందీ అతడే. అజయ్ జడేజా, మహ్మద్ అజహరుద్దీన్తో కలిసి 100+, సచిన్తో కలిసి 50+ భాగస్వామ్యాలు సాధించాడు. ఫీల్డింగ్లో 3 క్యాచులూ అందుకున్నాడు.
బ్యాటుతో పరుగులు
టీమ్ఇండియా 20 పరుగుల తేడాతో గెలిచిన తొలి వన్డేలో సౌరవ్ 17 పరుగులు చేసి 2 వికెట్లు తీశాడు. రెండో వన్డే నుంచి దాదాగిరి మొదలైంది. బౌలర్లు రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 116 పరుగులకు ఆలౌటైంది. బంతితో 9 ఓవర్లు వేసిన గంగూలీ 2 ఓవర్లు మెయిడిన్ చేసి 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఛేదనలో ఓపెనర్గా దిగి 32 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. వాతావరణం వల్ల మూడో వన్డే ఫలితం తేలలేదు. ఆట నిలిపేసే సమయానికి పాక్ 31.5 ఓవర్లకు 169/3 చేసింది. దాదా 7.5 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. మరుసటి రోజే 3 వన్డేను మళ్లీ నిర్వహించారు. మొదట భారత్ 182/6 స్కోరే చేసింది. గంగూలీ (2) బ్యాటుతో నిరాశపరిచినా బంతితో చెలరేగాడు. అత్యుత్తమ గణాంకాలు 10-3-16-5 నమోదు చేశాడు. 5 వికెట్లు తీసి మిడిలార్డర్ మొత్తం పడగొట్టాడు. ఐజాజ్ అహ్మద్, సలీమ్ మాలిక్, హసన్ రజా, మొయిన్ ఖాన్, ఆఖిబ్ జావెద్ను పెవిలియన్ పంపాడు. అతడి ధాటికి పాక్ 36.5 ఓవర్లకు 148కే ఆలౌటైంది. దాదాకు రెండో అవార్డు దక్కింది.
బంతితో వికెట్లు
నాలుగో వన్డేలోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దాదాదే. 28 ఓవర్లే జరిగిన ఈ మ్యాచులో పాక్ మొదట 6 వికెట్ల నష్టానికి 159 పరుగులే చేసింది. గంగూలీ 6 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. ఇక ఛేదనలో అదరగొట్టాడు. సచిన్ (6), రాబిన్ సింగ్ (16), అజ్జూ (7) విఫలమైనా ఒంటరిగా పోరాడాడు. 75 బంతుల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచాడు. అజయ్ జడేజా (37*)తో కలిసి విజయ తీరాలకు తీర్చాడు. దాంతో భారత్ 4-0తో సిరీసులో క్లీన్స్వీప్ దిశగా సాగింది. ఆఖరి వన్డేలో గెలుపు పాక్దే అయినా అవార్డు మాత్రం గంగూలీకే దక్కింది. సచిన్ (51)తో కలిసి ఓపెనింగ్ చేసిన కోల్కతా ప్రిన్స్ (96; 136 బంతుల్లో 5×4, 2×6) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. కానీ అజహర్ (50)తో కలిసి జట్టుకు 250/5 స్కోరు అందించాడు. బంతితో 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఆఖరి మ్యాచులోనైనా పరువు కాపాడుకోవాలన్న ఉద్దేశంతో పాక్ దూకుడుగా ఛేదించింది. మరో 37 బంతులు మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో గెలిచింది. మొత్తానికి బెంగాల్ టైగర్ కెరీర్లో గొప్ప గణాంకాలను నమోదు చేశాడు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.