WTC Final: వారి ఆటతీరు.. టాప్ఆర్డర్కు గుణపాఠం: సౌరభ్ గంగూలీ
ఆసీస్తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్లో భారత్కు సానుకూల ఫలితం రావాలంటే తప్పనిసరిగా బ్యాటర్లు రాణించాల్సిందే. భారీ లక్ష్యం నిర్దేశించినా ఏమాత్రం బెదరకుండా ఆడాలి.
ఇంటర్నెట్ డెస్క్: కీలకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final 2023) తొలి ఇన్నింగ్స్లో భారత టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. రవీంద్ర జడేజా (48), అజింక్య రహానె (89), శార్దూల్ ఠాకూర్ (51) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, పుజారా, విరాట్ తక్కువ స్కోరుకే పెవిలియన్కు చేరారు. ఈ క్రమంలో భారత టాప్ ఆర్డర్ బ్యాటింగ్ తీరుపై మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏడో వికెట్కు 109 పరుగులను జోడించిన రహానె, శార్దూల్ను చూసి టాప్ - 4 బ్యాటర్లు చూసి నేర్చుకోవాలని సూచించాడు. ఇది వారికి గుణపాఠంలాంటిదని పేర్కొన్నాడు.
‘‘రహానె, శార్దూల్ ఆడిన తీరు అభినందనీయం. ఇలాంటి వికెట్ మీద ఎలా ఆడాలో భారత డ్రెస్సింగ్ రూమ్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. రహానె సూపర్బ్గా ఆడాడు. శార్దూల్ గతంలోనూ ఇంగ్లాండ్, ఆసీస్పైనా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 296 పరుగులు చేయడం వల్ల తిరిగి పోటీలో నిలబడేందుకు అవకాశం దక్కింది. అందుకే, రెండో ఇన్నింగ్స్లోనైనా భారత టాప్ ఆర్డర్ రాణించాలి’’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.
మూడో రోజు ఆట అద్భుతం: రవిశాస్త్రి
‘‘తొలి రెండు రోజులు ఇబ్బంది పడిన భారత ఆటగాళ్లు.. మూడో రోజు మాత్రం మంచి ప్రదర్శన చేశారు. తొలుత బ్యాటింగ్లో రహానె - శార్దూల్ భాగస్వామ్యం అద్భుతం. దీంతో భారత్ కూడా మెరుగైన తొలి ఇన్నింగ్స్ స్కోరు చేయగలిగింది. ఆ తర్వాత బౌలింగ్లోనూ రాణించారు. ఆసీస్ బ్యాటర్లను మరిన్ని పరుగులు చేయకుండా అడ్డుకోగలిగారు. ఇప్పటికైతే ఆసీస్ను ఆపినా.. భారత్ ఇంకాస్త కష్టపడాలి’’ అని రవిశాస్త్రి సూచించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరతా.. సీఎంకు తెలిపిన భారాస ఎమ్మెల్యే!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్