WTC Final: వారి ఆటతీరు.. టాప్ఆర్డర్కు గుణపాఠం: సౌరభ్ గంగూలీ
ఆసీస్తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్లో భారత్కు సానుకూల ఫలితం రావాలంటే తప్పనిసరిగా బ్యాటర్లు రాణించాల్సిందే. భారీ లక్ష్యం నిర్దేశించినా ఏమాత్రం బెదరకుండా ఆడాలి.
ఇంటర్నెట్ డెస్క్: కీలకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final 2023) తొలి ఇన్నింగ్స్లో భారత టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. రవీంద్ర జడేజా (48), అజింక్య రహానె (89), శార్దూల్ ఠాకూర్ (51) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, పుజారా, విరాట్ తక్కువ స్కోరుకే పెవిలియన్కు చేరారు. ఈ క్రమంలో భారత టాప్ ఆర్డర్ బ్యాటింగ్ తీరుపై మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏడో వికెట్కు 109 పరుగులను జోడించిన రహానె, శార్దూల్ను చూసి టాప్ - 4 బ్యాటర్లు చూసి నేర్చుకోవాలని సూచించాడు. ఇది వారికి గుణపాఠంలాంటిదని పేర్కొన్నాడు.
‘‘రహానె, శార్దూల్ ఆడిన తీరు అభినందనీయం. ఇలాంటి వికెట్ మీద ఎలా ఆడాలో భారత డ్రెస్సింగ్ రూమ్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. రహానె సూపర్బ్గా ఆడాడు. శార్దూల్ గతంలోనూ ఇంగ్లాండ్, ఆసీస్పైనా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 296 పరుగులు చేయడం వల్ల తిరిగి పోటీలో నిలబడేందుకు అవకాశం దక్కింది. అందుకే, రెండో ఇన్నింగ్స్లోనైనా భారత టాప్ ఆర్డర్ రాణించాలి’’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.
మూడో రోజు ఆట అద్భుతం: రవిశాస్త్రి
‘‘తొలి రెండు రోజులు ఇబ్బంది పడిన భారత ఆటగాళ్లు.. మూడో రోజు మాత్రం మంచి ప్రదర్శన చేశారు. తొలుత బ్యాటింగ్లో రహానె - శార్దూల్ భాగస్వామ్యం అద్భుతం. దీంతో భారత్ కూడా మెరుగైన తొలి ఇన్నింగ్స్ స్కోరు చేయగలిగింది. ఆ తర్వాత బౌలింగ్లోనూ రాణించారు. ఆసీస్ బ్యాటర్లను మరిన్ని పరుగులు చేయకుండా అడ్డుకోగలిగారు. ఇప్పటికైతే ఆసీస్ను ఆపినా.. భారత్ ఇంకాస్త కష్టపడాలి’’ అని రవిశాస్త్రి సూచించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.