Sourav Ganguly : బుమ్రా భవిష్యత్పై గంగూలీ ఏమన్నాడంటే..?
బుమ్రా(Jasprit Bumrah) భవిష్యత్పై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ (Sourav Ganguly) స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్ : వెన్ను గాయం కారణంగా భారత పేస్ బౌలర్ బుమ్రా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ తదుపరి మ్యాచ్లకు దూరమైన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ ముంగిట అతడు గాయపడటం టీమ్ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బే. నెల రోజుల కంటే తక్కువ సమయమే ఉన్న ఈ మెగా టోర్నీకి దాదాపు అతడు దూరమైనట్లే కన్పిస్తోంది. అయితే.. దీనిపై ఇప్పటి వరకూ బీసీసీఐ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బుమ్రా గురించి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు.
బుమ్రా భవిష్యత్పై ఓ నిర్ధారణకు రావడం తొందరపాటే అవుతుందని దాదా వెల్లడించాడు. ‘‘బుమ్రా ఇంకా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించలేదు. దీనిపై ఉత్కంఠ ఉంది. అతడు జట్టుకు దూరమైనట్లు ఇప్పుడే చెప్పకండి’’ అని ఓ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ గంగూలీ వ్యాఖ్యానించాడు. బుమ్రా ఆస్ట్రేలియాకు వెళ్తాడా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ..‘నాకు తెలియదు.. రెండు మూడు రోజుల్లో దీని గురించి తెలుస్తుంది’ అని సమాధానమిచ్చాడు.
బుమ్రా గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు అతడి స్థానంలో హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.