Ganguly: అంతకన్నా ఇంకేం కావాలి?
టీమ్ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ టెస్టు అరంగేట్రంలోనే ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో శతకం సాధించి అందర్నీ ఆశ్చర్యపర్చిన సంగతి తెలిసిందే. అది జరిగి ఇప్పటికి 25 ఏళ్లు గడుస్తోంది...
అప్పుడు సచిన్ చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి..
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ టెస్టు అరంగేట్రంలోనే ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో శతకం సాధించి అందర్నీ ఆశ్చర్యపర్చిన సంగతి తెలిసిందే. అది జరిగి ఇప్పటికి 25 ఏళ్లు గడుస్తోంది. నాటి విశేషాల్ని గంగూలీ తాజాగా గుర్తు చేసుకుంటూ ఓ క్రీడాఛానెల్తో ముచ్చటించాడు. ఆ రోజు తాను తొలి శతకం బాదాక మానసికంగా అలిసిపోయానని చెప్పాడు. దాంతో అప్పుడు సచిన్ తన వద్దకు వచ్చి చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయన్నాడు. అలాగే తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే టీమ్ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో చారిత్రక టెస్టు సిరీస్ గెలుపొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు.
‘‘ఆ రోజు టీ బ్రేక్ సమయంలో నేను శతకంతో కొనసాగుతున్నా. అప్పటికే మానసికంగా అలసిపోయా. అది నా తొలి శతకం అయినందున భావోద్వేగానికి గురయ్యా. చాలా సంతోషం వేసింది. అలా ఉద్వేగానికి లోనవడంతో శారీరకంగా కాకున్నా మానసికంగా ఎంతో అలసిపోయా. టీ బ్రేక్కు వెళ్లినప్పుడు నా బ్యాట్ హ్యాండిల్ పట్టుకోల్పోతుందని టేప్ చుడుతుండగా సచిన్ నా వద్దకొచ్చి ‘నువ్వు ప్రశాంతంగా ఉండు. వెళ్లి చాయ్ తీసుకొని తాగు’ అని చెప్పాడు. అదిప్పటికీ గుర్తుంది. అలా నేను డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తుంటే సహచర ఆటగాళ్లంతా నన్ను అభినందించడానికి బయట నిల్చొని ఉన్నారు’’ అని గంగూలీ తన తొలి శతకం తీపిజ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.
‘‘నా క్రికెట్ ప్రయాణం మొత్తం అద్భుతంగా సాగింది. 1996లో అరంగేట్రంలోనే శతకం బాదాను. కొద్ది సంవత్సరాల్లోనే టీమ్ఇండియా కెప్టెన్గా ఎదిగా. జట్టును బలంగా తీర్చిదిద్దడం, దాంతో ప్రజల్లో మంచి గుర్తింపు రావడం, అక్కడి నుంచి కెప్టెన్సీ వదులుకొని జట్టులో కొనసాగడం, క్రికెట్ పాలనా వ్యవహరాల్లో మునిగిపోవడం ఆపై బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగడం, అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే టీమ్ఇండియా ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో చారిత్రక సిరీస్ గెలుపొందడం అంతా అద్భుతమైన ప్రయాణం. ఒక క్రీడాకారుడిగా, క్రికెటర్గా ఇంతకన్నా మంచిగా ఏం ఆశించగలం?’ అని గంగూలీ తన కెరీర్ మొత్తాన్ని నెమరువేసుకొని సంతోషం వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్