WTC Final: అదేం ఫీల్డింగ్.. రోహిత్ కెప్టెన్సీపై దాదా విసుర్లు!
ట్రావిస్ హెడ్ - స్టీవ్ స్మిత్ నాలుగో వికెట్కు 251 పరుగులను జోడించడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final 2023) తొలి రోజు ఆటలో ఆసీస్ ఆధిక్యం సాధించింది. ట్రావిస్ హెడ్ సెంచరీతో దూసుకుపోతున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final 2023) తొలి రోజు ఆటలో భారత్పై ఆస్ట్రేలియా పైచేయి సాధించడానికి ఫీల్డింగ్ కూడా ఓ ప్రధాన కారణంగా నిలిచింది. తొలి సెషన్లో మాత్రం మన బౌలర్లు ఆధిక్యత ప్రదర్శించారు. కానీ, ట్రావిస్ హెడ్ (146*) దూకుడుగా ఆడేశాడో భారత ఆటగాళ్లు నిరుత్సాహానికి గురయ్యారు. ఫీల్డింగ్ మోహరింపు కూడా ఏమాత్రం బాగోలేదనే వాదనా వచ్చింది. ఈ క్రమంలో టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీపైనా మరోసారి విమర్శలు వచ్చాయి. ఆసీస్ బ్యాటర్లు సునాయాసంగా పరుగులు సాధించినా... ఫీల్డింగ్ కూర్పు బాగాలేదని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) ఆక్షేపించాడు. అలాగే తుది జట్టు ఎంపికపైనా బాలీవుడ్ నటుడు హర్ష్వర్థన్ కపూర్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది.
‘‘టీమ్ఇండియా తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఆసీస్ 76/3 స్కోరుతో ఉన్నప్పుడు పైచేయి సాధించాల్సిన సమయంలో చేతులెత్తేసింది. ప్రత్యర్థి బ్యాటర్లు అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. లంచ్ బ్రేక్ తర్వాత రెండోఓవర్లోనే వికెట్ సాధించిన భారత్ అనంతరం లయను కోల్పోయింది. ట్రావిస్ హెడ్ పరుగులు చేసేలా మన ఫీల్డింగ్ ఉంది. అలవోకగా హుక్ షాట్లు కొట్టాడు. అతడు మంచి ఫామ్లో ఉన్నాడని తెలుసు. మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. కానీ, కీలకమైన ఫైనల్లో 76/3 స్కోరు ఉన్నప్పుడు క్రీజ్లోకి వచ్చిన హెడ్ సులువుగా పరుగులు రాబట్టాడు. అతడు అలా చేసేలా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ప్లేస్మెంట్ సరిగా లేకపోవడమే కారణం’’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.
పాజిటివ్ మైండ్ సెట్ ఉండుండే..: రవిశాస్త్రి
‘‘మన దృక్పథం పాజిటివ్గా ఉండుంటే టాస్ నెగ్గగానే బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లం. అప్పుడు తొలి సెషన్ను జాగ్రత్తగా ఆడి మొదటి రోజు బోర్డు మీద 250 పరుగులు ఉంచినా చాలు మంచి స్థితిలో ఉండేవాళ్లం. అయితే, ఇప్పుడు ఆసీస్ పైచేయి సాధించింది. వారు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. తొలి రోజు మొదటి సెషన్లో ఇబ్బంది పడినా.. పుంజుకుని ఆడిన తీరు అభినందనీయం’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
టీమ్ సెలెక్షన్ దారుణం: బాలీవుడ్ నటుడు
‘‘డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు విరాట్ కోహ్లీ కెప్టెన్గా లేకపోవడం తీవ్ర నిరుత్సాహం కలిగించింది. అతడు సారథిగా ఉన్నప్పుడు కనిపించిన దూకుడు ఇప్పుడు లేదు. రోహిత్ నాయకత్వంలో కనిపించడం లేదు. తుది జట్టు ఎంపిక కూడా దారుణంగా ఉంది. అశ్విన్ లేకపోవడం సరైంది కాదు. అలాగే, గాయం కారణంగా బుమ్రా దూరం కావడం కూడా భారీ నష్టమే’’ అని హర్ష్ వర్థన్ ట్వీట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం