IND vs SA: పోరాడిన సంజూ.. తొలి వన్డేలో భారత్ ఓటమి
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ పోరాడి ఓడింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా లఖ్నవూ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 9 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
లఖ్నవూ: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ పోరాడి ఓడింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా లఖ్నవూ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 9 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 250 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా నిర్ణీత 40 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేయగలిగింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్ (74 నాటౌట్; 65 బంతుల్లో 6×4, 2×6), డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్; 63 బంతుల్లో 5×4, 3×6) క్వింటన్ డికాక్ (48; 54 బంతుల్లో 5×5) విజృంభించడంతో భారీ స్కోరు చేసిన దక్షిణాఫ్రికా విజయం సాధించింది. జట్టును విజయతీరాలకు చేర్చేందుకు శ్రేయర్ అయ్యర్ (50; 8×4) సంజూ శాంసన్ (86 నాటౌట్; 63 బంతుల్లో 9×4,3×6) చేసిన పోరాటం వృథా అయ్యింది.
250 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది ఓపెనర్ శుబ్మన్ గిల్ (3) రబాడా వేసిన 2.4వ బంతికి బౌల్డయ్యాడు. కొద్దిసేపటికే వ్యాన్ పార్నెల్ బౌలింగ్లో కెప్టెన్ శిఖర్ ధావన్ (4) పెవిలియన్ బాట పట్టాడు. రుతురాజ్ గైక్వాడ్ (19) కూడా పెద్దగా పరుగులేమీ చేయకుండానే షంసీ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్.. ఇషాన్ కిషన్(20)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ జోడీని మహరాజ్ విడగొట్టాడు. జట్టు స్కోరు 51 పరుగుల వద్ద జెన్నేమన్కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ వెనుదిరిగాడు. ఆ తర్వాత లుంగి ఎంగిడి వేసిన 26.4వ బంతికి శ్రేయస్ భారీ షాట్కు ప్రయత్నించి రబాడా చేతికి చిక్కాడు. దీంతో సంజూ శాంసన్ (86 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బార్డును ముందుకు కదిలించాడు. అతడికి శార్థూల్ ఠాకూర్ (33; 31 బంతుల్లో 5×4) చక్కని సహకారం అందించాడు. కానీ, లుంగి ఎంగిడి బౌలింగ్లో జట్టు స్కోరు 211 పరుగుల వద్ద మహారాజ్ చేతికి చిక్కాడు. తర్వాత వచ్చిన కుల్దీప్ యాదవ్ (0), ఆవేశ్ ఖాన్ (3), రవి బిష్ణోయ్ (4) సింగిల్ డిజిట్కే పరిమితమవ్వడంతో ఫలితం దక్కలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా, రబాడా 2, వ్యాన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, షంసీ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచిన భారత్ దక్షిణాఫ్రికాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. వర్షం కారణంగా మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసిరినప్పటికీ క్యాచ్లు చేజార్చడం భారత్ పాలిట శాపమైంది. అవకాశాన్ని అందిపుచ్చుకున్న దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. మిల్లర్ (75 నాటౌట్), క్లాసెన్ (74 నాటౌట్), డికాక్ (48) బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించి భారత్ ముందుకు భారీ లక్ష్యాన్ని ఉంచారు. టీమ్ ఇండియా బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ 2 వికెట్లు తీయగా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు