IND vs SA: పోరాడిన సంజూ.. తొలి వన్డేలో భారత్ ఓటమి
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ పోరాడి ఓడింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా లఖ్నవూ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 9 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
లఖ్నవూ: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ పోరాడి ఓడింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా లఖ్నవూ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 9 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 250 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా నిర్ణీత 40 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేయగలిగింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్ (74 నాటౌట్; 65 బంతుల్లో 6×4, 2×6), డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్; 63 బంతుల్లో 5×4, 3×6) క్వింటన్ డికాక్ (48; 54 బంతుల్లో 5×5) విజృంభించడంతో భారీ స్కోరు చేసిన దక్షిణాఫ్రికా విజయం సాధించింది. జట్టును విజయతీరాలకు చేర్చేందుకు శ్రేయర్ అయ్యర్ (50; 8×4) సంజూ శాంసన్ (86 నాటౌట్; 63 బంతుల్లో 9×4,3×6) చేసిన పోరాటం వృథా అయ్యింది.
250 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది ఓపెనర్ శుబ్మన్ గిల్ (3) రబాడా వేసిన 2.4వ బంతికి బౌల్డయ్యాడు. కొద్దిసేపటికే వ్యాన్ పార్నెల్ బౌలింగ్లో కెప్టెన్ శిఖర్ ధావన్ (4) పెవిలియన్ బాట పట్టాడు. రుతురాజ్ గైక్వాడ్ (19) కూడా పెద్దగా పరుగులేమీ చేయకుండానే షంసీ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్.. ఇషాన్ కిషన్(20)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ జోడీని మహరాజ్ విడగొట్టాడు. జట్టు స్కోరు 51 పరుగుల వద్ద జెన్నేమన్కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ వెనుదిరిగాడు. ఆ తర్వాత లుంగి ఎంగిడి వేసిన 26.4వ బంతికి శ్రేయస్ భారీ షాట్కు ప్రయత్నించి రబాడా చేతికి చిక్కాడు. దీంతో సంజూ శాంసన్ (86 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బార్డును ముందుకు కదిలించాడు. అతడికి శార్థూల్ ఠాకూర్ (33; 31 బంతుల్లో 5×4) చక్కని సహకారం అందించాడు. కానీ, లుంగి ఎంగిడి బౌలింగ్లో జట్టు స్కోరు 211 పరుగుల వద్ద మహారాజ్ చేతికి చిక్కాడు. తర్వాత వచ్చిన కుల్దీప్ యాదవ్ (0), ఆవేశ్ ఖాన్ (3), రవి బిష్ణోయ్ (4) సింగిల్ డిజిట్కే పరిమితమవ్వడంతో ఫలితం దక్కలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా, రబాడా 2, వ్యాన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, షంసీ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచిన భారత్ దక్షిణాఫ్రికాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. వర్షం కారణంగా మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసిరినప్పటికీ క్యాచ్లు చేజార్చడం భారత్ పాలిట శాపమైంది. అవకాశాన్ని అందిపుచ్చుకున్న దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. మిల్లర్ (75 నాటౌట్), క్లాసెన్ (74 నాటౌట్), డికాక్ (48) బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించి భారత్ ముందుకు భారీ లక్ష్యాన్ని ఉంచారు. టీమ్ ఇండియా బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ 2 వికెట్లు తీయగా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
Mumbai Indians Captiancy: ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్య... ఈ మార్పు అభిమానులకు సమ్మతమేనా? -
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు