Concussion: పీఎస్ఎల్లో చెన్నై ఆటగాడికి కంకషన్
పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్న దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ ఫా డుప్లెసిస్ కంకషన్కు గురయ్యాడు...
అబుదాబి: పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్న దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ ఫా డుప్లెసిస్ కంకషన్కు గురయ్యాడు. శనివారం రాత్రి పెషావర్ జాల్మీ జట్టుతో మ్యాచ్ ఆడుతుండగా సహచర ఆటగాడు మహ్మద్ హస్నేన్ను బలంగా ఢీకొని కిందపడిపోయాడు. దాంతో వెంటనే పరీక్షించిన అక్కడి ఫిజియోలు అతడిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, గ్లాడియేటర్స్ జట్టులో ఇలా రెండు రోజుల వ్యవధిలో ఆటగాళ్లు కంకషన్కు గురవ్వడం ఇది రెండోసారి.
అంతకుముందు ఇస్లామాబాద్ యునైటెడ్తో జరిగిన మ్యాచ్లో గ్లాడియేటర్స్ ఆటగాడు ఆండ్రీ రసెల్ బ్యాటింగ్ చేస్తూ కంకషన్కు గురయ్యాడు. ప్రత్యర్థి బౌలర్ మహ్మద్ ముసా వేసిన ఓ బౌన్సర్ అతడి హెల్మెట్కు తగలడంతో తలకు దెబ్బ తగిలింది. దాంతో రసెల్ను కూడా ఆ మ్యాచ్ నుంచి తప్పించారు. తాజాగా డుప్లెసిస్ గాయపడడంతో అతడి సతీమణి ఇమారి ఇన్స్టాగ్రామ్లో ఆందోళన వ్యక్తం చేసింది. అతడికి ఎలా ఉందోనని కంగారుపడింది. తనకు చాలా బాధగా ఉందని వ్యాఖ్యానించింది. డుప్లెసిస్ను ఆస్పత్రిలో చూపించాలని కోరింది.
కరోనా కారణంగా మార్చిలో వాయిదాపడిన పీఎస్ఎల్ నాలుగు రోజుల క్రితమే తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలోనే డుప్లెసిస్ యూఏకి చేరుకొని గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్నాడు. ఇస్లామాబాద్తో జరిగిన గత మ్యాచ్లో 5 పరుగులు చేసిన అతడు ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేయలేకపోయాడు. అంతకుముందు డుప్లెసిస్ ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఏడు మ్యాచ్ల్లో నాలుగు అర్ధశతకాలు సాధించి మొత్తం 320 పరుగులు చేశాడు. దాంతో సీఎస్కేను విజయపథంలో నడిపించాడు. ఈ క్రమంలోనే టోర్నీ నిలిచిపోయేసరికి ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే బుడగలో పలు కరోనా కేసులు నమోదవ్వగా మే 4న టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు. దాంతో మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్లో యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రూపొందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.