Tokyo Olympics: కొంపముంచిన అత్యుత్సాహం
టోక్యో ఒలింపిక్స్ మొదలై ఐదు రోజులు అవుతున్నా.. ప్రారంభోత్సవ వేడుకలకు సంబంధించి అనేక విశేషాలు నెట్టింట్ల వైరల్ అవుతున్నాయి. ఆ వేడుకలో వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు పరేడ్లో పాల్గొంటారనే విషయం తెలిసిందే. అందులో ప్రధాన అథ్లెట్లు వారి దేశ పతాకాన్ని ప్రదర్శిస్తూ మార్చ్లో పాల్గొంటారు. వారిని
విమర్శలపాలైన దక్షిణకొరియా బ్రాడ్కాస్టింగ్ సంస్థ
ఇంటర్నెట్డెస్క్: టోక్యో ఒలింపిక్స్ మొదలై ఐదు రోజులు అవుతున్నా.. ప్రారంభోత్సవ వేడుకలకు సంబంధించి అనేక విశేషాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ వేడుకలో వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు పరేడ్లో పాల్గొంటారనే విషయం తెలిసిందే. అందులో ప్రధాన అథ్లెట్లు వారి దేశ పతాకాన్ని ప్రదర్శిస్తూ మార్చ్లో పాల్గొంటారు. వారిని బ్రాడ్కాస్టింగ్ కంపెనీలు టీవీల ద్వారా ప్రసారం చేస్తుంటాయి. అలా దక్షిణకొరియాకు చెందిన ఓ బ్రాడ్కాస్టింగ్ సంస్థ పరేడ్ను చూపించడంలో అత్యుత్సాహం ప్రదర్శించి నెట్టింట విమర్శలపాలైంది. దీంతో బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ ఏమైందంటే..!
ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్ని దక్షిణకొరియాలో ఎంబీసీ అనే ఛానల్ ప్రసారం చేసింది. అయితే, పరేడ్లో పాల్గొనే దేశాల క్రీడాకారులు పెద్దగా ఎవరికి తెలియదు.. కాబట్టి దేశాలకు సంబంధించి గుర్తుండిపోయే ఘటనలను చూపించాలని నిర్ణయించింది. ఈ విధంగా ప్రపంచదేశాల గురించి అవగాహన కల్పించినట్లయితుందని భావించింది. ఈ క్రమంలో కొన్ని దేశాలకు ఆ ఛానెల్ ప్రదర్శించిన ఫొటోలు.. పెట్టిన కాప్షన్లే ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.
ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా హైతి దేశపు అథ్లెట్లు పరేడ్ చేస్తున్న సమయంలో ఎంబీసీ ఛానెల్ ‘‘ఆ దేశంలో అధ్యక్షుడు హత్యకు గురికావడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది’’అని కాప్షన్ ఇచ్చింది. సిరియాకు చెందిన అథ్లెట్లు రాగానే ‘‘అక్కడ భూగర్భవనరులు ఎక్కువ. అలాగే పదేళ్లుగా అంతర్యుద్ధం జరుగుతోంది’’ అని పేర్కొంది. మార్షల్ఐలాండ్స్కు ‘‘ఒకప్పుడు ఈ ప్రాంతం యూఎస్ అణుపరీక్షలకు కేంద్రంగా ఉండేది’’అని, ఉక్రెయిన్కు ‘‘చెర్నోబిల్ విపత్తు-ప్రపంచంలోనే అతి దారుణమైన అణుప్రమాదం’’అని ఫొటోలను చూపిస్తూ కాప్షన్లు పెట్టింది. ఇటలీకి పిజ్జా, నార్వేకు సాల్మొన్ చేప, రొమానియాకు డ్రాకులా, ఎల్ సాల్విడర్కు బిట్కాయిన్(ఆ దేశంలో బిట్కాయిన్ను అధికారికం చేసిన నేపథ్యంలో) ఫొటోలు ప్రదర్శించింది.
దీంతో ఆ ఛానెల్పై నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తాయి. దేశాలకు సంబంధించి ఇలాంటి దుర్ఘటనలు, ఫొటోలే దొరికాయా అని మండిపడ్డారు. అవి అభ్యంతరకరంగా ఉన్నాయని ఆక్షేపించారు. దీంతో ఎంబీసీ ఛానెల్ క్షమాపణలు చెప్పక తప్పలేదు. కేవలం ఆయా దేశాలను సులభంగా గుర్తుపట్టొచ్చన్న ఉద్దేశంతోనే వాటిని వాడినట్లు వివరణ ఇచ్చింది. ఫొటోలు, కాప్షన్ల ఎంపికను సరిగా పరిశీలించలేదని.. ఇది క్షమించరాని పొరపాటేనని ఒప్పుకుంది. ఈ పొరపాటు ఎలా జరిగిందో అంతర్గత విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్