WTC Final: మూడో రోజు ఆట కొనసాగేనా?
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మూడో రోజుకు చేరుకుంది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో శుక్రవారం కనీసం బంతి పడకుండానే ఆట ముగిసింది. రెండోరోజైన శనివారం రెండు సెషన్ల మేర ఆట కొనసాగింది. వెలుతురు లేమి కారణంగా మూడో సెషన్ కుదర్లేదు.....
సౌథాంప్టన్లో వర్షం.. తొలి సెషన్ కష్టం!
సౌథాంప్టన్: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మూడో రోజుకు చేరుకుంది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో శుక్రవారం కనీసం బంతి పడకుండానే ఆట ముగిసింది. రెండోరోజైన శనివారం రెండు సెషన్ల మేర ఆట కొనసాగింది. వెలుతురు లేమి కారణంగా మూడో సెషన్ కుదర్లేదు. మూడో రోజైన ఆదివారమూ పరిస్థితులు మెరుగ్గా ఏం లేవు.
సౌథాంప్టన్ కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు అక్కడ వర్షం కురుస్తూనే ఉంది. ఆకాశం మేఘావృతమైంది. ఈ లెక్కన తొలిసెషన్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మధ్యాహ్నం సైతం 80% వరకు వర్షం కురుస్తుందని వాతావరణ వెబ్సైట్లు అంచనా వేశాయి. ‘ఉదయం భారీ వర్షం కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత కొంత తగ్గొచ్చు. అప్పుడప్పుడు ఎండ వస్తుంది. సాయంత్రానికి వాతావరణం పొడిగా మారే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 21 డిగ్రీలు ఉంటుంది’ అని బ్రిటన్ వాతావరణ శాఖ తెలిపింది.
మొదటి రోజు ఆట రద్దు కావడంతో రెండోరోజు టాస్ వేశారు. టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్ భారత్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించాడు. వెలుతురు లేమితో ఆట ముగించే సరికి టీమ్ఇండియా 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44 బ్యాటింగ్; 124 బంతుల్లో 1×4) అర్ధశతకానికి చేరువయ్యాడు. అజింక్య రహానె (29 బ్యాటింగ్; 79 బంతుల్లో 4×4) అతడికి తోడుగా ఉన్నాడు. వీరిద్దరూ 147 బంతుల్లో 58 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ శర్మ (34; 68 బంతుల్లో 6×4), శుభ్మన్ గిల్ (28; 64 బంతుల్లో 3×4) ఫర్వాలేదనిపించారు. మొత్తంగా 64.4 ఓవర్ల ఆట మాత్రమే సాగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.