భారత్ ఈ మ్యాచ్లో అద్భుతం చేయవచ్చు: మాజీ క్రికెటర్ మైకేల్ వాన్
ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్కి గెలిచే అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయని మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అన్నారు. విజయం సాధించాలంటే ఛేదించాలంటే ఆధిక్యం చాలానే ఉన్నా.. హెడింగ్లే మైదానంలో అద్భుతాలు జరుగవచ్చని వాన్ అన్నారు.
లీడ్స్: ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్కి గెలిచే అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అన్నారు. విజయం సాధించాలంటే ఛేదించాలంటే ఆధిక్యం చాలానే ఉన్నా.. హెడింగ్లే మైదానంలో అద్భుతాలు జరుగవచ్చని వాన్ అన్నారు. భారత్ నాలుగో రోజు మొదటి సెషన్లో జాగ్రత్తగా ఆడాలని సూచించాడు. ‘ఇక్కడ ఉదయం మంచు కురుస్తుంది. కాబట్టి, పిచ్ మందకోడిగా ఉండటంతో పాటు బంతి గింగిరాలు తిరుగుతుంది. దీంతో నాలుగో రోజు భారత బ్యాట్స్మెన్ మొదటి సెషన్లో కొద్ది సేపు ఇబ్బంది పడవచ్చు. ప్రత్యర్థి జట్టుకు వికెట్లు తీసేందుకు కూడా ఇదే అనువైన సమయం. భారత్ మొదటి సెషన్లో వికెట్లు కోల్పోకుండా ఆడితే బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. అందుకే, మొదటి సెషన్ ఆట ఇరుజట్లకు చాలా కీలకం కానుంది’ అని మైకేల్ వాన్ అభిప్రాయపడ్డారు.
మూడో రోజు ఆట ముగిసిన అనంతరం మైకేల్ వాన్ మాట్లాడుతూ.. ‘భారత్ ఇంకా చాలా వెనుకబడి ఉంది. కానీ, ఉదయం సెషన్లో వారు కేవలం ఒక వికెట్ను మాత్రమే కోల్పోయి అద్భుతంగా రాణించారు. గతంలో ఇదే వేదికపై భారత్ 4 వికెట్లు కోల్పోయినా విజయం సాధించింది. ప్రస్తుతం భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. అందుకే ఈ మ్యాచ్లో అద్భుతాలు జరుగవచ్చనిపిస్తోంది’ అని అన్నాడు.
మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అనుసరించిన వ్యూహాలను వాన్ ప్రశంసించారు. ఫాస్ట్ బౌలర్లకు వెలుతురు సహకరించకపోవడంతో స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం, కొత్త బంతితో వికెట్లు తీసేందుకు ప్రయత్నించడం వంటి ఎత్తుగడలను అభినందించారు. మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్ 139 పరుగులు వెనుకబడి ఉంది. ఇంకా 8 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఛెతేశ్వర్ పుజారా(180 బంతుల్లో 91), విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 45) క్రీజులో ఉన్నారు.
2019లో ఆసిస్తో ఇక్కడే జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్స్టోక్స్ అద్భుతంగా రాణించి జట్టుకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. 219 బంతుల్లో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అది గొప్ప ఛేదనల్లో ఒకటిగా చరిత్రలో మిగిలిపోయింది. గతంలో మరో దిగ్గజ బ్యాట్స్మెన్ ఇయాన్ బోథమ్ కూడా ఇదే పిచ్లో 149 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె