ఆమె కొడితే గోల్ పోస్టులోకే..
ఫుట్బాల్లో తెలుగు క్రీడాకారుల ప్రాతినిధ్యం తీరను లోటుగానే మిగిలిపోయింది. పాతికేళ్లుగా ఒక్క క్రీడాకారిని జాతీయ జట్టులో చోటుదక్కించుకోలేకపోయింది. కాగా ఆ కలను నెరవేరుస్తూ.. ఆ నిరీక్షణకు తెరదించుతూ తెలుగు ప్రజల....
తెలుగు ప్రజల కలను సాకారం చేసిన నిజామాబాద్ క్రీడాకారిణి
ఇంటర్నెట్ డెస్క్: ఫుట్బాల్లో తెలుగు క్రీడాకారుల ప్రాతినిధ్యం తీరని లోటుగానే మిగిలిపోయింది. పాతికేళ్లుగా ఒక్క క్రీడాకారిణి జాతీయ జట్టులో చోటుదక్కించుకోలేకపోయింది. కాగా ఆ కలను నెరవేరుస్తూ.. ఆ నిరీక్షణకు తెరదించుతూ తెలుగు ప్రజల కలను సాకారం చేసింది నిజామాబాద్ యువతి. రెంజల్ మండలం కూనేపల్లి కృష్ణ తండాకు చెందిన సౌమ్య జాతీయ ఫుట్బాల్ జట్టులో చోటు దక్కించుకుని సత్తా చాటింది. ఏడో తరగతిలో ఉన్నప్పుడు పాఠశాల స్థాయిలో జరిగే పరుగు పోటీలో సౌమ్య మెరుపు వేగంతో దూసుకెళ్లింది. ఆమె ప్రతిభను గుర్తించిన స్థానిక ఫుట్బాల్ కోచ్ నాగరాజు సౌమ్య తల్లిదండ్రులు గుగులోత్ గోపి, ధనలక్ష్మితో మాట్లాడారు. సౌమ్యను ఫుట్బాల్ శిక్షణకు పంపిస్తే గొప్ప క్రీడాకారిణి అవుతుందని చెప్పారు. అమ్మాయిలకు ఆటలెందుకని మొదట వారు నిరాకరించినా.. కోచ్ నచ్చజెప్పడంతో వారు ఒప్పుకొన్నారు.
2015లోనే అండర్-14 జాతీయ జట్టుకు ఎంపికైన సౌమ్య అప్పటినుంచి సీనియర్ జట్టులో స్థానం కోసం పట్టుదలతో ప్రయత్నించింది. చైనాలో జరిగిన అండర్-16 పోటీల్లో అత్యధిక గోల్స్ కొట్టి టాపర్గా నిలిచింది. తెలంగాణ ఉమెన్స్ లీగ్లోనూ ఆమె టాప్ స్కోరర్. గతేదాడి జాతీయస్థాయి ఉమెన్స్ లీగ్లో ముంబయి ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్లబ్ క్యాంక్రీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించింది. 2018లో బ్రిక్స్ దేశాల మధ్య జరిగిన జూనియర్ మహిళా ఫుట్బాల్ పోటీల్లోనూ జట్టు కెప్టెన్గా తన ప్రతిభేంటో నిరూపించుకుంది. 2022లో ఖతార్లో జరిగే ఆసియా కప్ టోర్నీకి పటిష్ఠమైన మహిళా జట్టును పంపించాలని భారత ఫుట్బాల్ సమాఖ్య కసరత్తు ప్రారంభించింది. గోవాలో రెండున్నర నెలల పాటు శిక్షణా శిబిరం నడిపింది. ఇందులో స్ట్రైకర్గా సౌమ్య చక్కటి ప్రతిభ కనబరచడంతో తుది 20 మంది జట్టులో ఆమె స్థానం దక్కించుకొంది. ఈ జట్టు ఫిబ్రవరి 14 నుంచి టర్కీలో జరిగే టోర్నమెంట్లో పాల్గొననుంది.
దేశ ఫుట్బాల్ జట్టులో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలనుంచి ప్రాతినిధ్యం లేకపోగా సౌమ్య ఆ లోటును భర్తీ చేసింది. జాతీయ సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్న తొలి తెలంగాణ క్రీడాకారిణిగా సౌమ్య రికార్డు సాధించింది. భవిష్యత్తులో జరగబోయే టోర్నమెంట్లలోనూ సౌమ్య రాణించాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి...
ఐపీఎల్ తుది జాబితాలో 292 మంది ఆటగాళ్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?