Hyderabad: హైదరాబాద్ జట్టు.. ఎవరిని తీసుకుంటే మంచిదంటే?
టీ20 మెగా టోర్నీలో హైదరాబాద్ది ప్రత్యేకమైన స్థానం. డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఆ జట్టు నిలకడైన ప్రదర్శన చేసింది. గతేడాది మాత్రమే అన్ని విభాగాల్లో విఫలమై ఘోర పరాభవం ఎదుర్కొంది...
దృష్టిపెట్టాల్సిన కీలక ఆటగాళ్లు వీళ్లే.
మెగా టీ20 టోర్నీలో హైదరాబాద్ది ప్రత్యేకమైన స్థానం. డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఆ జట్టు నిలకడైన ప్రదర్శన చేసింది. గతేడాది మాత్రం అన్ని విభాగాల్లో విఫలమై ఘోర పరాభవం ఎదుర్కొంది. అదే సమయంలో జట్టు యాజమాన్యం వార్నర్ను కెప్టెన్గా తొలగించింది. ఆ తర్వాత తుది జట్టు నుంచీ వీడ్కోలు పలికింది. దీంతో హైదరాబాద్ ఓ గొప్ప ఓపెనర్ను కోల్పోయింది. మరోవైపు కేన్ విలియమ్సన్ కెప్టెన్గా ఉన్నా ఈ మెగా వేలంలో సరికొత్త ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సన్రైజర్స్ దగ్గర ఇంకా ఎంత సొమ్ము మిగిలి ఉంది? అందులో ఎవరెవరిని తీసుకుంటే బాగుంటుందో ఓ లుక్కేద్దాం..
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు..
హైదరాబాద్ ఈ మెగా టోర్నీకి ముగ్గురు క్రికెటర్లను మాత్రమే అట్టిపెట్టుకుంది. అందులో కెప్టెన్ కేన్ విలియమ్సన్కు ఒకరు కాగా, మిగతా ఇద్దరు భారత యువ పేసర్లు ఉన్నారు. కెప్టెన్కు రూ.14 కోట్లు కేటాయించిన సన్రైజర్స్.. మిగిలిన ఇద్దరు బౌలర్లు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్కు చెరో రూ4. కోట్లు వెచ్చించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆ జట్టు వద్ద 22 స్లాట్లు ఖాళీ ఉన్నాయి. ఇంకా రూ.68 కోట్లు మిగిలి ఉన్నాయి. దీంతో సరైన కోర్ జట్టును హైదరాబాద్ ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఓపెనర్లే కీలకం..
వార్నర్ సారథ్యంలో హైదరాబాద్ ఫ్రాంఛైజీ గతంలో బాగా రాణించిందంటే కారణం ఆ జట్టుకున్న ఓపెనర్లే ప్రధాన కారణం. అందులో ఒకరు వార్నర్ ఉండగా మరొకరు ఇంగ్లాండ్ ఓపెనర్ జానీ బెయిర్స్టో ఉండేవాడు. కానీ ఈసారి ఆ జట్టు వారిద్దరినీ వదిలేయడంతో ఇప్పుడు మళ్లీ అంతటి గొప్ప ఓపెనర్లను తీసుకోవాలి. అయితే ప్రస్తుతం వేలంలో పాల్గొంటున్న క్రికెటర్లలో ఓపెనర్లుగా కనిపించే ఆటగాళ్ల జాబితా చూస్తే క్వింటన్ డికాక్, ఫా డుప్లెసిస్ ముందు వరుసలో ఉన్నారు. కొన్నేళ్లుగా ముంబయి జట్టుకు ప్రధాన ఓపెనర్గా ఉన్న డికాక్ ఆ జట్టుకు విలువైన పరుగులే అందించాడు. మరోవైపు డుప్లెసిస్ సైతం గతేడాది చెన్నై జట్టులో రాణించి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో హైదరాబాద్ కచ్చితంగా ఈ ఇద్దరిలో ఒకరిని తీసుకునే వీలుంది.
మిడిల్ ఆర్డర్ సమస్య తీర్చుకునేనా..?
సన్రైజర్స్ ఎప్పుడూ ప్రధానంగా ఎదుర్కొనే సమస్య మిడిల్ఆర్డర్ బ్యాటింగ్. నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఇదివరకు ఎంత మందిని ప్రయోగించి చూసినా సరైన ఫలితం రాబట్టలేకపోతోంది. దీంతో ఈ స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్ల కోసం ఇప్పుడు హైదారబాద్ యాజమాన్యం దృష్టి సారించే అవకాశం ఉంది. అయితే, ఆ స్థానాలను సరైన న్యాయం చేసే ఆటగాళ్లు వేలంలో కొద్ది మంది ఉన్నారు. వారిలో సురేశ్ రైనా, శ్రేయస్ అయ్యర్, అంబటి రాయుడు ప్రధానంగా కనిపిస్తున్నారు. రైనా ఈ టోర్నీలో అత్యంత కీలకమైన బ్యాట్స్మన్గా ఉన్నా.. ఈసారి తప్పనిసరి పరిస్థితుల్లో చెన్నై వదిలేసుకుంది. మరోవైపు రాయుడు కూడా చెన్నైలో కీలక ఆటగాడే. మిడిల్ ఆర్డర్లో దంచికొట్టగల సమర్థుడు. ఇక దిల్లీ వదిలేసుకున్న మేటి బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్. ఈ ముగ్గురూ విలియమ్సన్కు తోడైతే హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ సమస్య తీరినట్లే.
ఆల్రౌండర్ల మాటేంటి?
ఏ జట్టుకైనా పరిస్థితులను బట్టి రాణించే ఆల్రౌండర్ కావాలి. సన్రైజర్స్ కూడా అలాంటి ఆటగాళ్లపైనే ఇప్పుడు గురిపెట్టాలి. అయితే, ఎక్కువశాతం అన్ని జట్లూ పేస్ బౌలింగ్, బ్యాటింగ్ చేసే ఆటగాళ్లను కొనుగోలు చేయాలని చూస్తాయి. అలాంటప్పుడు హైదరాబాద్ కూడా సరైన ఆల్రౌండర్లనే ఎంచుకోవాలి. అలాంటప్పుడు ఈ జాబితాలో కనిపించే మొదటి పేరు శార్దూల్ ఠాకూర్. మరోవైపు దీపక్ చాహర్ సైతం ఇటీవల బ్యాటింగ్లో అదరగొడుతున్నాడు. ఇక షకీబ్ అల్ హసన్, రాహుల్ త్రిపాఠి సైతం లోయర్ ఆర్డర్లో ఆదుకునే ఆటగాళ్లుగా ఉన్నారు. ఈ నలుగురిలో ఏ ఇద్దరిని తీసుకున్నా సన్రైజర్స్కు కలిసొచ్చే అవకాశం ఉంది.
బౌలింగూ ముఖ్యమే..
హైదరాబాద్ జట్టులో ఇదివరకు భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ లాంటి ఇద్దరు స్పెషలిస్టులు ఉండేవారు. ఒకరు స్పిన్నర్గా సేవలందించగా మరొకరు పేసర్గా ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆ జట్టు ఇద్దరినీ వదిలేయడంతో కచ్చితంగా వారికి సమానమైన ఆటగాళ్లను తీసుకోవాల్సిన అవసరం ఉంది. రషీద్కు సరితూగే స్పిన్నర్ కావాలంటే ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్నే ఎంపిక చేసుకోవచ్చు. అలాగే భువీకి ఏమాత్రం తగ్గని పేస్ బౌలర్ కావాలంటే మహ్మద్ షమి ఉన్నాడు. వీరికి తోడు యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్ లాంటి స్పిన్నర్లు.. ట్రెంట్ బౌల్ట్, ప్యాట్ కమిన్స్, రబాడా లాంటి విదేశీ పేసర్లు సైతం హైదరాబాద్కు బాగా పనికొచ్చే బౌలర్లుగా ఉన్నారు.
అయితే, మెగా వేలంలో ఎవరు ఎవర్ని ఏ లెక్కల ప్రకారం కొనుగోలు చేస్తారో కచ్చితంగా చెప్పలేం. కాబట్టి వీరిలో కనీసం సగం మందినైనా హైదరాబాద్ తీసుకుంటే ఈసారి మెగా టోర్నీలో జట్టుకు పూర్వవైభవం తెచ్చుకునే అవకాశం ఉంది.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్