IPL 2021:సన్రైజర్స్ గెలవడానికి ఆడాలి.. అతడికి వీడ్కోలు పలకడానికి కాదు: గంభీర్
సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత పేలవ ప్రదర్శనను కనబరుస్తూ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్ కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. శుక్రవారం రాత్రి ముంబయి
ఇంటర్నెట్ డెస్క్: సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత పేలవ ప్రదర్శనను కనబరుస్తూ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్ కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. శుక్రవారం రాత్రి ముంబయి ఇండియన్స్తో తమ చివరి మ్యాచ్ను ఆడనుంది. కాగా, ఈ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న డేవిడ్ వార్నర్ ఈ సీజన్లో అంతగా రాణించలేకపోయాడు. దీంతో అతడిని కొన్ని మ్యాచ్ల నుంచి తుది జట్టులోకి కూడా తీసుకోలేదు.
ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. వచ్చే సీజన్లో వార్నర్ ఆరెంజ్ ఆర్మీకి దూరమవుతాడనే వార్తలు వస్తున్నాయి. 2016లో సన్రైజర్స్ ఛాంపియన్గా నిలిపిన వార్నర్కి చివరి మ్యాచ్లోనైనా అవకాశం ఇచ్చి వీడ్కోలు పలకాలని అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా కోరుతున్నారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గెలవడానికే మ్యాచ్లు ఆడాలి తప్ప వ్యక్తులకు వీడ్కోలు పలకడానికి కాదు అని ఘాటుగా స్పందించాడు.
‘చాలా మంది గొప్ప గొప్ప ఆటగాళ్లకే వీడ్కోలు మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. కొంతమంది దిగ్గజ ఆటగాళ్లకు కూడా ఈ అవకాశం మిస్సయింది. ఈ విషయం మనందరికీ తెలుసు. అసలు వీడ్కోలు మ్యాచ్ వ్యవస్థ ఏమిటో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఎవరైనా గెలుపే అంతిమ లక్ష్యంగా మ్యాచ్ ఆడతారు. తుదిజట్టులో అత్యుత్తమ ఫామ్లో ఉన్న పదకొండు మంది ఆటగాళ్లలో అతడూ ఒకడైతే కచ్చితంగా ఆడతాడు. అంతేగానీ.. అతడికి తుదిజట్టులో చోటు ఇవ్వాలనే నిబంధనేం లేదు కదా. కాబట్టి సన్రైజర్స్ మ్యాచ్ గెలవాలి. కానీ, వీడ్కోలు పలకడానికి పరిమితం కాకూడదు’ అని వార్నర్ని ఉద్దేశించి గంభీర్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.