అత్యధిక వన్డేల్లో ఓటమి పాలైన జట్టు ఇదే!

శ్రీలంక క్రికెట్‌ జట్టు మరో అనవసరపు రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇదివరకు టీ20ల్లో వరుసగా ఐదు సిరీస్‌లు కోల్పోయి అప్రతిష్ట మూటగట్టుకున్న ఆ జట్టు తాజాగా వన్డేల్లో.. భారత్‌ పేరిట ఉన్న అత్యధిక ఓటముల రికార్డును అధిగమించింది...

Published : 03 Jul 2021 01:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంక క్రికెట్‌ జట్టు ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది. వన్డే క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఓటమి పాలైన జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇప్పటివరకూ అత్యధిక వన్డేల్లో ఓటమి చవిచూసిన జట్టుగా టీమ్‌ ఇండియా ఉండేది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో లంక టీమ్‌ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు తొలి వన్డేలోనూ 5 వికెట్ల తేడాతో విఫలమైంది. దాంతో ఈ ఫార్మాట్‌లో మొత్తం 428 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఇక వన్డేల్లో భారత విజయశాతం 54.67గా ఉండగా, శ్రీలంకది 47.69గా నమోదైంది. అలాగే పాకిస్థాన్‌ 414 ఓటములతో మూడో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా.. భారత్‌, శ్రీలంక జట్లు మరికొద్ది రోజుల్లో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని