Team India: కోహ్లీసేన లాగే ధావన్ సేన..!
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేముందు టీమ్ఇండియా ప్రధాన బృందం ముంబయిలో ఎలాగైతే 14 రోజులు ప్రత్యేకంగా క్వారంటైన్లో ఉందో ఇప్పుడు శ్రీలంక పర్యటనకు వెళ్లబోయే యువ బృందం కూడా అలాగే ఉంటుందని ఓ బీసీసీఐ అధికారి తాజాగా...
ఇంటర్నెట్డెస్క్: ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేముందు టీమ్ఇండియా ప్రధాన బృందం ముంబయిలో ఎలాగైతే 14 రోజులు ప్రత్యేకంగా క్వారంటైన్లో ఉందో ఇప్పుడు శ్రీలంక పర్యటనకు వెళ్లబోయే యువ బృందం కూడా అలాగే ఉంటుందని ఓ బీసీసీఐ అధికారి తాజాగా వెల్లడించారు. జూన్ 14 నుంచి 28 వరకు ఆటగాళ్లంతా ఓ హోటల్లో ఉంటారని, వారికి రోజు విడిచి రోజు మొత్తం ఆరుసార్లు ఆర్టీ-పీసీఆర్ కరోనా పరీక్షలు జరుపుతారని ఆయన చెప్పారు.
‘ఇంగ్లాండ్కు బయలుదేరి వెళ్లేముందు కోహ్లీసేన ఇక్కడ ఎలాగైతే క్వారంటైన్లో గడిపిందో ఇప్పుడు ధావన్ జట్టుకు కూడా అవే నియమాలు వర్తిస్తాయి. ఈ పర్యటనకు ఎంపిక చేసిన ఆటగాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లు ప్రత్యేక ఛార్టర్ విమానాల్లో వస్తారు. మరి కొందరు ప్యాసింజర్ విమానాల్లో రానున్నారు. ముంబయికి చేరుకున్నాక ఏడు రోజులు తమ గదుల నుంచి బయటకు రాకుండా ఉంటారు. ఆపై హోటల్లోనే ఒకరినొకరు కలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఇక అక్కడే జిమ్లో సాధన చేస్తూ ఫిట్నెస్ సాధిస్తారు. ఇక కొలంబోకి చేరుకున్నాక ఆటగాళ్లు మరో మూడు రోజులు హోటల్ గదులకే పరిమితమవుతారు. ఆపై ఇంగ్లాండ్లో కోహ్లీసేన ఎలా సాధన చేస్తుందో ఈ జట్టు కూడా అక్కడ అలాగే ప్రాక్టీస్ చేస్తుంది. జట్టు రెండు గ్రూపులుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతుంది’ అని ఆ అధికారి వివరించారు.
కాగా, ధావన్ నేతృత్వంలోని టీమ్ఇండియా జులై 13 నుంచి 18 వరకు వన్డే సిరీస్లో తలపడనుండగా.. 21 నుంచి 25 వరకు పొట్టి సిరీస్లో ఆడనుంది. ఈ మ్యాచ్లన్నీ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి. ఇక ఈ పర్యటనకు బీసీసీఐ రెండు రోజుల క్రితమే 20 మంది ఆటగాళ్లతో జాబితా విడుదల చేసింది. అదనంగా ఐదుగురిని నెట్ బౌలర్లుగా ఎంపిక చేసింది.
శ్రీలంక పర్యటనకు టీమ్ఇండియా:
శిఖర్ ధావన్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవ్దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్(కీపర్), సంజూ శాంసన్ (కీపర్), యుజువేంద్ర చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, నవ్దీప్ సైని, చేతన్ సకారియా.
నెట్ బౌలర్లు: ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, అర్ష్దీప్ సింగ్, సాయి కిషోర్, సిమర్జీత్ సింగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!