DK: ఆ సమయంలో రోహిత్పై విమర్శకుల బంతులు దూసుకొచ్చాయి: డీకే
ఎంతటి పెద్ద స్టార్ ఆటగాడికైనా టెస్టుల్లో రాణిస్తేనే గుర్తింపు వస్తుంది. తమలోని శక్తి సామర్థ్యాలు టెస్టు క్రికెట్ ద్వారానే బయటకొస్తాయి. ప్రస్తుతం టీమ్ఇండియా...
ఇంటర్నెట్ డెస్క్: ఎంతటి పెద్ద స్టార్ ఆటగాడికైనా టెస్టుల్లో రాణిస్తేనే గుర్తింపు వస్తుంది. తమలోని శక్తి సామర్థ్యాలు టెస్టు క్రికెట్ ద్వారానే బయటకొస్తాయి. ప్రస్తుతం టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన (2007) ఆరేళ్లకుగానీ టెస్టుల్లో అవకాశం దక్కలేదు. అయితే విండీస్తో 2013లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన రోహిత్ మొదటి మ్యాచ్లోనే శతకం (177) కొట్టడం విశేషం. అలానే రెండో టెస్టులోనూ (111*) సెంచరీ బాదేశాడు. అరంగేట్రం చేసిన వెంటనే వరుసగా రెండు శతకాలు చేయడం రోహిత్కే సాధ్యమైంది.
అయితే .. ఆ తర్వాత దాదాపు నాలుగేళ్లపాటు రోహిత్ ఖాతాలో ఒక్క సెంచరీ లేదు. నాగ్పుర్ వేదికగా 2017లో శ్రీలంకపై 102 పరుగులు చేసి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. కానీ నాలుగో సెంచరీకి మళ్లీ రెండేళ్ల సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఈసారి మాత్రం విశాఖపట్నంలో 2019లో దక్షిణాఫ్రికాపై రెండు ఇన్నింగ్స్ల్లోనూ (176, 127) శతకాలు చేసి అబ్బురపరిచాడు. ఇక ఆ తర్వాత జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. తొలుత మిడిలార్డర్లో ఆడిన రోహిత్ ఇప్పుడు ఓపెనర్గా మారాడు. అంతేకాకుండా టీమ్ఇండియా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. అయితే ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం దక్కని స్థితిలో రోహిత్ చాలా ఇబ్బందిపడ్డాడని టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్ వెల్లడించాడు.
‘‘రోహిత్ ఎప్పుడూ తనపై నమ్మకం ఉంచుకునేవాడు. కెరీర్ ఆరంభంలో తప్పకుండా టెస్టు క్రికెట్ ఆడతానని భావించేవాడు. అయితే మా మధ్య జరిగిన చర్చల్లో.. చాలాసార్లు కష్టపడినా పరిణామాలు మాత్రం అనుకూలంగా వచ్చేవి కావని బాధపడుతూ ఉండేవాడు. కొన్నిసార్లు నిర్లక్ష్యంగా షాట్లు కొట్టి పెవిలియన్కు చేరాడు. అయితే మళ్లీ పుంజుకుంటాననే నమ్మకం మాత్రం విడవలేదు. కానీ అతడు అనుకున్నంత వేగంగా టెస్టుల్లోకి రాలేకపోయినా.. వైట్బాల్ క్రికెట్లో మాత్రం అద్భుతాలు చేశాడు. టెస్టు క్రికెట్లో రోహిత్ మాదిరిగా అరంగేట్రం ఘనంగా చేసిన ఆటగాళ్లు మరెవరూ లేరనుకుంటా. వచ్చీ రాగానే.. వరుసగా రెండు సెంచరీలు నమోదు చేశాడు. అదే సమయంలో సచిన్ కూడా రిటైర్ అయ్యాడు. దీంతో ఇక రోహిత్కు తిరుగుండదని చాలా మంది భావించారు. అయితే జీవితం, క్రీడల్లో మనం అనుకున్నవిధంగా జరగదు కదా.. నాలుగేళ్లపాటు ఒక్క సెంచరీ లేక రోహిత్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడటంతో బయట నుంచి అతడిపై ఒక్కసారిగా విమర్శలు కర్వ్ బంతుల రూపంలో విరుచుకుపడ్డాయి’’ అని దినేశ్ కార్తిక్ తెలిపాడు.
రోహిత్ శర్మ ఇప్పటి వరకు 45 టెస్టుల్లో 46కిపైగా సగటుతో 3,137 పరుగులు సాధించాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, ఎనిమిది శతకాలు, 14 అర్ధశతకాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ