స్మిత్ ఔట్‌: ఆసీస్ ఆధిక్యం 229

బ్రిస్బేన్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా అయిదో వికెట్ కోల్పోయింది. అర్ధశతకంం సాధించిన స్టార్ బ్యాట్స్‌‌మన్‌ స్టీవ్‌ స్మిత్ (55)ను సిరాజ్ బోల్తా కొట్టించాడు.

Published : 18 Jan 2021 09:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రిస్బేన్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా అయిదో వికెట్ కోల్పోయింది. అర్ధశతకంం సాధించిన స్టార్ బ్యాట్స్‌‌మన్‌ స్టీవ్‌ స్మిత్ (55)ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. బౌన్సర్‌ అంచనా వేయడంలో విఫలమైన స్మిత్ రహానె చేతికి చిక్కాడు. క్రీజులో గ్రీన్ (14*), పైన్‌ ఉన్నారు. కాగా, గ్రీన్‌-స్మిత్ అయిదో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 55 ఓవర్లకు ఆసీస్‌ స్కోరు 196/5. టీమిండియా కంటే 229 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 21/0తో ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ఆరంభించిన సంగతి తెలిసిందే.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని