T20 League : హార్దిక్ను చూస్తుంటే అప్పటి రోహిత్ గుర్తుకొస్తాడు: సునిల్ గావస్కర్
టీ20 లీగ్లో గుజరాత్ ప్లేఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో ...
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్లో గుజరాత్ ప్లేఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్య కెప్టెన్సీపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నాయకత్వ నైపుణ్యంతో గుజరాత్ను అద్భుతంగా నడిపిస్తున్నాడని క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ కొనియాడాడు. రోహిత్ శర్మ ముంబయికి తొలిసారి కెప్టెన్గా ఎంపికైనప్పటి రోజులను హార్దిక్ గుర్తు చేస్తున్నాడని పేర్కొన్నాడు. నాయకుడిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే బ్యాటర్గా చాలా వృద్ధి చెందాడని తెలిపాడు.
‘‘ఇప్పుడు హార్దిక్ సారథ్యం చూస్తున్నప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీ గుర్తుకొస్తుంది. టీ20 లీగ్ 2013 సీజన్ మధ్యలో ముంబయి జట్టుకు రోహిత్ నాయకత్వ బాధ్యతలను చేపట్టాడు. అప్పటి నుంచి అతడి బ్యాట్ నుంచి టీ20ల్లో 40లు, 50లు, 60లు చూస్తున్నాం. రోహిత్ షాట్ సెలెక్షన్ కూడా మెరుగైంది. అలాంటి పోలికలే హార్దిక్లోనూ మనం చూడొచ్చు. హార్దిక్ షాట్ సెలెక్షన్ కూడా అదిరింది. ఇద్దరూ మంచి ఫీల్డర్లే. ఇలాంటి క్వాలిటీనే గుజరాత్ను టాప్లో నిలబట్టేలా చేసింది’’ అని సునిల్ గావస్కర్ వివరించాడు. గత సీజన్ వరకు ముంబయి తరఫునే కొనసాగిన హార్దిక్ పాండ్యను రిటెయిన్ చేసుకోకపోవడంతో మెగా వేలంలోకి వెళ్లాడు. అయితే కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ హార్దిక్ను ముందే తీసేసుకొని కెప్టెన్గా నియమించుకుంది. ప్రస్తుతం ఎనిమిది మ్యాచుల్లో ఏడు విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో గుజరాత్ (14) టాప్ స్థానంలో కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా