Virat Kohli: స్పిన్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ బౌల్డ్.. అలా ఆడితే బాగుండేది: గావస్కర్
టీమ్ఇండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) న్యూజిలాండ్తో తొలి వన్డేలో (IND vs NZ) విఫలమై నిరాశపరిచాడు. స్పిన్ బౌలింగ్లో బౌల్డ్ కావడం అభిమానులకు రుచించలేదు.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకపై రెండు శతకాలు బాది అదరగొట్టేసిన విరాట్ కోహ్లీ.. ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో మాత్రం తేలిపోయాడు. కేవలం 8 పరుగులకే పెవిలియన్కు చేరి అభిమానులను నిరాశపరిచాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయి పెవిలియన్కు చేరాడు. ఈ క్రమంలో కోహ్లీ ఔట్ కావడంపై క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సాంట్నర్ వేసిన స్ట్రెయిట్ డెలివరీని ఆడటంలో విఫలం కావడం సరికాదని పేర్కొన్నాడు.
‘‘వికెట్ల లైన్కు లోపలగా విరాట్ కోహ్లీ ఆడటంతోనే సాంట్నర్ బంతి వికెట్లను గిరాటేసింది. అతడు బంతిని బ్యాక్ ఫుట్ వేసి ఆడేందుకు ప్రయత్నించాడు. అదే ముందుకు ఆడి ఉంటే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకొనేవాడు. అదేమీ మరీ వికెట్ల ముందు పడిన బంతి కాదు. అయితే, కాస్త టర్న్ విరాట్ కోహ్లీ బౌల్డ్ కావాల్సి వచ్చింది’’ అని గావస్కర్ తెలిపాడు. స్టార్ బ్యాటర్లు త్వరగా పెవిలియన్కు చేరినప్పటికీ యువ బ్యాటర్ శుబ్మన్ గిల్ (208) డబుల్ సెంచరీ బాదడంతో న్యూజిలాండ్పై భారత్ 349/8 భారీ స్కోరు సాధించింది. అనంతరం మైకెల్ బ్రాస్వెల్ (140) భయపెట్టినా.. సిరాజ్ (4/46) సూపర్ బౌలింగ్ ప్రదర్శనతో కివీస్ను 337 పరుగులకు ఆలౌట్ చేసి 12 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.