IND vs AUS: విరాట్ ఔట్.. గావస్కర్ తీవ్ర అసంతృప్తి!
విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆసీస్ చేతిలో భారత్ (IND vs AUS) ఘోర పరాజయం చవిచూసింది. అయితే, దీనికంటే అభిమానులను బాధించే మరో అంశం ఉంది. ఇద్దరు బ్యాటర్లు గత మ్యాచ్ మాదిరిగానే ఔట్ కావడంపై విమర్శలు రేగాయి. అందులో ఒకరు విరాట్ కాగా.. మరొకరు సూర్యకుమార్ యాదవ్ కావడం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో (IND vs AUS) ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. తొలి వన్డేలో 4 పరుగులు, రెండో వన్డేలో 31 పరుగులు చేశాడు. రెండుసార్లూ ఎల్బీ రూపంలో పెవిలియన్కు చేరడం గమనార్హం. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో ఓవైపు వికెట్లు పడినా నిలకడగా ఆడినట్లు కనిపించాడు. తీరా, మరోసారి తన బలహీనతను బయటపెట్టుకుని ఆసీస్ బౌలర్ ఎల్లిస్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. విరాట్ ఔటైన తీరుపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తొలి వన్డేలో మాదిరిగానే రెండో మ్యాచ్లోనూ ఔట్ కావడం సరైంది కాదని పేర్కొన్నాడు.
‘‘విరాట్ మరోసారి లైన్ను దాటేసి ఆడాడు. చేసిన తప్పేంటో కోహ్లీకి తెలుసు. ఇటీవల చాలా మ్యాచుల్లో ఇలానే ఔటై పెవిలియన్కు చేరాడు. స్క్వేర్ లెగ్ వైపు ఆడేందుకు ప్రయత్నించడం వల్లే ఇలా జరుగుతోంది. మిడ్ఆన్ మీదుగా కూడా ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు. అందుకే, ఇలాంటి ఇబ్బందులు తప్పడం లేదు’’ అని గావస్కర్ తెలిపాడు. మిచెల్ స్టార్క్ విజృంభించడంతో భారత్ 117 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆసీస్ కేవలం 11 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది.
సూర్య ఔట్పై కోహ్లీ..
స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ను మరోసారి దురదృష్టం వెంటాడింది. తొలి బంతికే స్టార్క్ బౌలింగ్లో ఎల్బీగా పెవిలియన్కు చేరాడు. మొదటి వన్డేలోనూ స్టార్క్ బౌలింగ్లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. రెండుసార్లూ సూర్యకుమార్ ఒకేలా ఔట్ కావడంపై నాన్స్ట్రైకింగ్లో ఉన్న విరాట్ కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, విరాట్ కోహ్లీ కూడా గత మ్యాచ్ మాదిరిగానే ఎల్బీగా ఔట్ కావడం గమనార్హం. కనీసం డీఆర్ఎస్ తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.